CM Revanth: గ్రూప్-1పై కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ
- గ్రూప్-1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తాం- సీఎం
- టీజీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుంది- రేవంత్ రెడ్డి
- గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్-1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. టీజీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు 1:100 పిలవాలని కోరుతున్నారు.. తమకేం ఇబ్బంది లేదు పిలవడానికి.. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుందనిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని తేల్చి చెప్పారు.
Read Also: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పరీక్ష రాయలేనోడు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న దీక్ష చేసిన ముగ్గురు.. ఏ ఒక్క పరీక్ష రాసిన దాఖలాలు లేవని అన్నారు. ఏ ఉద్యోగానికి పరీక్ష రాయలేనోడు.. పరీక్షలు వాయిదాలు వేయాలని దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్లు వస్తాయో.. ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తెలియదన్నారు.
Read Also: INDIA bloc: ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభంజనం.. కూటమికి 10, బీజేపీకి 02..
జాబ్ క్యాలెండరు విడుదల తర్వాత ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు జరుగుతాయని క్లారిటీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత ఉందన్నారు. మార్చి నెల ఆఖరి వరకు అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పిస్తాం.. ప్రతి ఏడాది ఇదే వ్యవహారం కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల ఖాళీల ప్రకారం ఎలాగైతే నోటిఫికేషన్లు వస్తాయో.. తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల భర్తీ అలాగే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!