CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
- రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11:05 నుంచి 12:05 గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
Read Also: Pawan Kalyan: తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు
Also Read
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. 600 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి రానున్నారు. ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి వచ్చేనాటికే ప్రధానమైన ఆనకట్ట ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!