Bhatti Vikramarka: మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ సబండ వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షాలు నెరవేర్చకుండా దగా చేశారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 42 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1.20 లక్షల కోట్ల రూపాయలకు పెంచి తెలంగాణలో అదనంగా ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమని అధికారం ఇచ్చిన ప్రజలను వంచన చేసి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తాకట్టు పెట్టిన సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వచ్చే ప్రభుత్వాలు దాదాపు 30 ఏండ్ల పాటు ప్రజలపై పన్నుల భారం మోపాల్సిన దుస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ భ్రమలో నుంచి ప్రజలు తేరుకొని పీపుల్స్ మార్చ్ తో కదం తొక్కుతుండ్రు అంటూ ఆయన పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలకు చెందాల్సిన సంపదను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని గుర్తించిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి చేయడానికి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్నాను అని భట్టి అన్నారు.
Also Read : Rajasthan :మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. కట్ చేస్తే.. శవమైంది..
పాదయాత్రకు ఎదురు వచ్చి మహిళలు స్వచ్ఛందంగా ఇక చాలు దొర పాలన అంటూ కేసీఆర్ పై ఆక్రోశాన్ని వెలగక్కుతుండ్రు అని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీడ వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారం ఉందని విర్రవీగి, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఎంతమందిని అరెస్టు చేయిస్తారో చేసుకోండి.. తెలంగాణ గడ్డ పౌరుషాల అడ్డ.. పోలీస్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరు లేరు.. తప్పు చేసేది ఎంత పెద్ద వారైనా అచ్చంపేట గడ్డ ప్రశ్నిస్తుంది అని అన్నారు.
Also Read : Health Warnings: సిగరెట్పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్న ఆ దేశం
చేతిలో అధికారం ఉందని పోలీసులతో బెదిరించాలని చూస్తే అధికార పార్టీ నాయకులను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు జాగ్రత్త అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అధికార పార్టీ నాయకులు విర్రవీగేది ఇక రెండు నెలలు మాత్రమే.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ఆటలు ఇక సాగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలని మోడీ, కేసీఆర్ డబ్బులు పంపించిన అక్కడి ప్రజలు వారిని కట్టగట్టి నేలకు కొట్టారు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తది. ప్రజలకు అండగా ఉంటది. ధరణిపై హక్కులు కోల్పోయిన రైతులందరికీ భూములపై హక్కులు కల్పిస్తుంది అని భట్టి విక్రమార్క అన్నారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్