రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి నీరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ మందలించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై స్కూల్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chinnamail Anji Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీఫామ్.. ప్రచారంలో దూకుడు