TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల నడకమార్గాలలో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఇవాళ కూడా అలిపిరి నడకమార్గంలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. దీంతో వారిని గుర్తించి తిరిగి కుటుంభసభ్యులుకు అప్పగించారు భధ్రతాసిబ్బంది. మరోవైపు నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల తరువాత 15 సంవత్సరాలు లోబడిన చిన్నారులకు నడకమార్గంలో అనుమతి నిరాకరించింది.
Health News: అరటి పండు పరగడుపున తినొచ్చా?
Also Read
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టి తిరిగి సాధరణ పరిస్థితులు నెలకొన్న తరువాతే చిన్నారులుకు పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై తిరుమలకు వెళ్లే దారిలో చిరుత దాడికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చిరుత దాడిలో అక్షిత అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనల నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు అలిపిరి మార్గంలో వెళ్లే పిల్లలకు ట్యాగ్ లను ఏర్పాటు చేస్తుంది టీటీడీ. తిరుమల నడక మార్గంలో ఏడో మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తుల బృందాలను అనుమతించనున్నారు. భక్తుల ముందు, వెనుక రోప్ పార్టీలను టీటీడీ నియమించింది. ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్
మరోవైపు నిన్నటి రోజు కూడా నడకమార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో చిరుతల సంచారిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు వద్ద ప్రాంతంలో చిరుత సంచారిస్తుంది. రెండవ ఘాట్ రోడ్డు 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే భవిష్యత్త్ లో ఎలాంటి ఘటనలు జరగకుండ ఉండేందుకు టీటీడీ అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!