Ameenpur: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం
- నా భార్యను ఎన్కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం
- పిల్లలకు విషం పెట్టి చంపి తాను ఆత్మహత్యయత్నం నాటకం ఆడింది
- పిల్లలు చనిపోయారని చెప్తే.. నా భార్య కంటి నుంచి చుక్క నీరు కూడా రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కన్న తల్లే కర్కశంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీన్ పూర్ లో రజిత, చెన్నయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరి సంసారంలో గెట్ టు గెదర్ పార్టీ చిచ్చుపెట్టింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన రజిత టెన్త్ క్లాస్ లో తనతోపాటు చదువుకున్న శివతో పాత పరిచయానికి బీజం పడింది. ఇంకేముంది.. భర్త అంటే ఇష్టం లేని రజిత శివతో చనువు పెంచుకుంది. కొంత కాలం నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది.
Also Read:USA: ట్రంప్ భయం.. సూపర్ మార్కెట్లకు అమెరికన్ల పరుగు.. వేటిని ఎక్కువగా కొంటున్నారంటే..?
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
తన జీవితాన్ని శివతోనే గడపాలని నిర్ణయించుకున్న రజిత తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది. అయితే పిల్లలను చంపేసి వస్తే పెళ్లి చేసుకుంటానని శివ రజితకు సలహా ఇచ్చాడు. తాను కోరుకున్న జీవితం దక్కాలంటే పిల్లలను భర్తను అడ్డుతొలగించుకోవాని నిర్ణయించుకుంది. ఓ రోజు రాత్రి పిల్లలకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తనకు కడుపునొప్పి వస్తుందని నాటకం ఆడింది. వెంటనే భర్త చెన్నయ్య ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. పిల్లలు ఎలా చనిపోయారో తెలియక చెన్నయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. అయితే మొదట చెన్నయ్య మీదనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు రంగంలోకి దిగి తమదైన స్టై్ల్లో విచారణ చేపట్టగా రజిత అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.
Also Read:Ponguleti Sudharkar Reddy : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి
ప్రియుడు శివతో కలిసి జీవించేందుకు తానే పిల్లలను చంపినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో పోలీసులు రజితను, ప్రియుడు శివను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భర్త చెన్నయ్య తన పిల్లల మృతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. నన్ను చంపి నా పిల్లల్ని వదిలిపెట్టినా బాగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెన్నయ్య మాట్లాడుతూ.. నాకు నా భార్యకు 20 ఏళ్ల తేడా ఉంది.. నా భార్య నన్ను కొన్ని నెలలుగా మునుగ చెట్టు ఎక్కించి భజన చేసింది.. నన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి నా ఆస్తి ఆమె పేరు మీద రాస్తేనే చేసుకుంది..
Also Read:Shocking Video: వృద్ధాశ్రమానికి వెళ్లనందుకు.. అత్తపై దారుణంగా దాడి చేసిన కోడలు..
శివకుమార్ ని కలిసిన తర్వాత నుంచి నా భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది.. పిల్లలకు విషం పెట్టి చంపి తాను ఆత్మహత్యయత్నం నాటకం ఆడింది.. పిల్లలు చనిపోయారని చెప్తే.. నా భార్య కంటి నుంచి చుక్క నీరు కూడా రాలేదు.. నా భార్య నన్ను క్షమించమని కోరితే మన్నించే ప్రసక్తే లేదు.. నా భార్యకు చావే శరణ్యం చంపేయండి లేదంటే మరణశిక్ష విధించండి.. నా భార్యను ఎన్కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం అంటూ చెన్నయ్య పోలీసులను కోరాడు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!