USA: ట్రంప్ భయం.. సూపర్ మార్కెట్లకు అమెరికన్ల పరుగు.. వేటిని ఎక్కువగా కొంటున్నారంటే..?
- అమెరికన్లలో ట్రంప్ టారిఫ్ భయాలు..
- సూపర్ మార్కెట్లకు యూఎస్ ప్రజల పరుగు..
- సుంకాలు అమలులోకి రాకముందే వస్తువుల కొనుగోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించాడు. ట్రంప్ దెబ్బతో అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పరుగు తీస్తున్నారు. విదేశీ వస్తువులపై సుంకాలు ప్రకటించిన కొన్ని రోజు తర్వాత, ధరలు తక్కువగా ఉన్నప్పుడే పలు వస్తువుల్ని కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. దీంతో స్టోర్లు, సూపర్ మార్కెట్ల ముందు రద్దీ పెరిగింది.
బట్టలు, బూట్లు, ఫర్నీచర్, కాఫీ వంటి ముఖ్యమైన వస్తువులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ది బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఇన్నాళ్లు కొంత కాలం వేచి చూద్దాం అనుకున్న కస్టమర్లు కూడా ట్రంప్ టారిఫ్ భయం వల్ల ఇప్పటికిప్పుడు తమకు కావాల్సిన వస్తువుల్ని షాపింగ్ చేస్తున్నారు. అధిక ధరలు చెల్లించకుండా ఉండేందుకు అమెరికన్లు తొందర పడుతున్నాడు. ముఖ్యంగా అమెరికా వెలుపల అసెంబుల్ అయిన ఆటోమొబైల్స్ కొనాలనుకునే వారు, ఇప్పుడే కొంటున్నారు.
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
Read Also: Ponguleti Sudharkar Reddy : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి
అమెరికన్లు కొంటున్న వస్తువులు ఇవే..
ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లు
ట్రంప్ తైవాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 32 శాతం, చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిపై 52 శాతం సుంకాలు విధించడంతో అమెరికన్లు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు తొందరపడుతున్నారు. వీటి భాగాలు ఎక్కువగా విదేశాలు, ముఖ్యంగా చైనా నుంచి వస్తాయి.
దుస్తులు, బూట్లు
అనేక బ్రాండెడ్ బట్టలు ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాం నుంచి అమెరికాకు వస్తుంటాయి. దీంతో ఈ దేశాలపై సుంకాలు అమలులోకి రాకముందే ఎక్కువ దుస్తులు కొనుగోలు చేయాలని అమెరికన్లు భావిస్తున్నారు. అమెరికన్లు జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్లతో పాటు షూలను కొనుగోలు చేస్తున్నారు.
ఆటోమొబైల్స్
కొత్త కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని ప్లాన్ చేసుకున్న వారు, అమెరికాకు దిగుమతి అయిన కార్లను కొనుగోలు చేయడానికి షోరూంలకు పరిగెత్తుతున్నారు. ధరలు పెరగక ముందే కార్లు బుక్ చేయాలని భావిస్తున్నారు.
విదేశీ ఆహారాలు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆహార పదార్థాలను కొనేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కాఫీ, స్నాక్స్, మసాలా దినుసులు, ఇతర కిరాణా వస్తువులను కొంటున్నారు. సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే నిల్వ చేసుకుంటున్నారు.
జిమ్ అండ్ వెల్నెస్ పరికరాలు
ట్రెడ్ మిల్స్, స్టేషనరీ బైక్లు, మసాజ్ చైర్స్, జిమ్ పరికరాలు వివిధ దేశాల నుంచి అమెరికాకు వస్తుంటాయి. వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.
ఎలక్ట్రిక్ పరికరాలు:
ధరలు పెరగకముందే అమెరికన్లు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్లు మరియు డిష్వాషర్లు వంటి హోమ్ నీడ్స్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. చైనా, తైవాన్ నుంచి ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువులు వస్తుంటాయి. ఈ రెండు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు.
ఇతర వస్తువుల్లో భవన నిర్మాణ సామాగ్రి, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులైన డైపర్లు, బొమ్మలు, వారికి బట్టలు కొనుగోలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!