Polavaram Project: ఏపీకి గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అదనపు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Project: ఆంధ్రప్రదేశ్కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంజూరైన రూ.12,911 కోట్లలో రూ. 2,000 కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండటం వల్ల జరిగిన అదనపు ఖర్చును కవర్ చేయడానికి కూడా నిధులు ఉన్నాయని పేర్కొన్నారు.. పోలవరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు రూ.12,911 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ నిధుల పరిమాణాన్ని ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మెమోరాండం జారీ చేసిందని అధికారులు తెలిపారు. కేంద్రంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అలుపెరగని ప్రయత్నాలు, చర్చలు, సంప్రదింపుల ఫలితమే అని పేర్కొన్నారు.. ప్రాజెక్టు జాప్యానికి కారణమవుతున్నందున బిల్లుల చెల్లింపు నుండి మినహాయింపును అందించడంతోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మెమోరాండంను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి డ్యామ్ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించి, ప్రధాన ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. పోలవరం వద్ద వంతెన నిర్మాణంతో పాటు సందర్శకుల కోసం హోటల్ను నిర్మించడం మరియు ఇతర సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రాజెక్ట్ సైట్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిపై కేంద్రం వివరణ కోరింది.. గైడ్ వాల్లో పగుళ్లు ఏర్పడిన స్థితిని పెద్దదిగా చూపి.. “చిన్న నష్టం గురించి గందరగోళం” సృష్టిస్తున్నారని ఓ వర్గం మీడియాపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్.. కాగా, గైడ్ వాల్ డిజైన్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపిందని, పగుళ్లపై సమాచారం అందిందని, సాంకేతిక సంఘం సూచనల మేరకు మరమ్మతులు చేపడతామని అధికారులు వివరించారు. 48 రేడియల్ గేట్లు, రివర్ స్లూయిస్ గేట్లు, పవర్ హౌస్ వద్ద టన్నెల్ పనులు, వైబ్రో కాంపాక్షన్, గ్యాప్ 1 వద్ద ఇసుక నింపడం, అలాగే ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్కు ఇసుక రవాణా వంటి పనులను వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఎట్ గ్యాప్ 2 ప్రాంతం పూర్తయింది, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి కావస్తున్నాయని వివరించారు. అంతేకాకుండా, ఎగువ కాఫర్డ్యామ్ ఎత్తు పెంపుతో సహా డయాఫ్రమ్ వాల్కు అన్ని మరమ్మతులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి నివేదించారు.
తాజావార్తలు
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!