Central Team: ఏపీలో కేంద్రం బృందం.. ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Team: ఆంధ్రప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాన్ కల్లోలం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు. దీంతో ఏపీలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఏపీలో పర్యటించింది. రెండురోజుల పాటు ఏపీలో కేంద్ర పర్యటిస్తోంది. మిచౌంగ్ తుఫాన్తో జరిగిన పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనా వేస్తోంది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరులో పర్యటించింది కేంద్ర బృందం. తుఫాన్తో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. పంట నష్టం పరిహారంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి అందిస్తామన్నారు కేంద్ర అధికారులు.
Read Also: CM YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పరట్యన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
అంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు కేంద్ర బృందం సభ్యులు. మిచౌంగ్ తుఫాన్తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. మరోవైపు కర్నూలు జిల్లాలో వర్షాలు లేక నష్టపోయిన పంటలను కూడా పరిశీలించింది కేంద్ర బృందం. కర్నూలు జిల్లా ఆస్పరిలో పర్యటించి.. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎకరా పొలానికి 30 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నామని.. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు అధికారుల ముందు వాపోయారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించి క్షేత్ర స్థాయిలో జరిగిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆపై కేంద్రం ఏపీలో జరిగిన పంట నష్టంపై నివేదిక ఆధారంగా పరిస్థితిని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!