BL Verma: అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BL Verma: దేశంలో అభివృద్ధి జరగాలంచే డబులు ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 1980లో జన సంఘ్తో ప్రారంభమైన పార్టీ.. కార్యకర్తల కృషితో ఈ రోజు ఇంత పెద్ద పార్టీగా అవతరించిందని కేంద్ర మంత్రి చెప్పారు. సీనియర్ కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు అని.. సీనియర్ కార్యకర్తలు వారి అనుభవాన్నీ, నైపుణ్యతను పార్టీ అభివృద్ధికి వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగిన ఎకైక పెద్ద పార్టీ బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 9 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసంఘ్ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశవ్యాప్తంగా ప్రజలను నేరుగా కలవనున్నారని ఆయన చెప్పారు.
Read Also: Marriage Record: 12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
“2014కు పూర్వం చాలా ప్రభుత్వాలు అధికారం చెలాయించాయి.గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ప్రధాని అనతి కాలంలో చేసి చూపించారు. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి మోడీ కృషి చేస్తున్నారు. 11 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ పేరుతో 6వేల రూపాయల పంట పెట్టుబడి అందిస్తున్నారు. రైతులపై భారం పడకుండా ఎరువుల ధర తగ్గించి అందిస్తున్నారు. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. మోడీని అడ్డుకోవడానికి అవినీతి పరులంతా ఒక్కటవుతున్నారు. గత ప్రభుత్వాల పాలనలో 74 ఎయిర్ పోర్ట్ లు నిరిస్తే , మోదీ పాలనలో 75 ఎయిర్ పోర్టుల నిర్మాణం జరిగింది. కరోనా కాలంలో 80కోట్ల మంది ప్రజలకు 5కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశాం. అనతి కాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి 3 సార్లు అందించడం జరిగింది.శరవేగంగా ఎదుగుతున్న దేశాలలో ప్రపంచంలోనే మన దేశం 5వ స్థానంలో ఉంది. అభివృద్ధి జరగాలంటే డబులు ఇంజిన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.” అని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!