Experium Eco Park: ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎక్స్పీరియం పార్క్ ప్రారంభం.
- ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు.
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవ్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు చెందిన మొక్కలను సేకరించి నాటారు. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకాల స్టోన్స్, అందమైన శిలలను జాగ్రత్తగా సేకరించి గార్డెన్ను అందంగా తీర్చిదిద్దారు.
Also Read: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
ఈ అద్భుత పార్కును తీర్చిదిద్దేందుకు సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆకారానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వ్యయం చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్ 1,500 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలను ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. రూ. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాలలో మ్యాన్మేడ్ బీచ్ ప్రత్యేకంగా రూపొందించారు. నూతన వధూవరులకు, ఫొటోగ్రఫీ ప్రేమికులకు ప్రీ వెడ్డింగ్, ఫొటోషూట్ లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇది హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అద్భుత ప్రకృతి కోవెలగా నిలవనుంది.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!