Harish Rao: టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!
- ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది
- ఎస్ఎల్బీసీ ప్రపంచంలోనే క్రిటికల్, సెన్సిటివ్ ప్రాజెక్ట్
- 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాం
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అనడం విడ్డురంగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడం వలనే ప్రమాదం జరిగింది. మేము ప్రాజెక్టును ఆలస్యం చేశామనేది శుద్ధ తప్పు. మేము ఎస్ఎల్బీసీ కోసం అసెంబ్లీలో చర్చ పెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేశాము. ఇది పూర్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాము. ఎస్ఎల్బీసీ ప్రపంచంలోనే క్రిటికల్, సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
‘కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టులో అనుమతిస్తే ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అంటుంది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయి. ఎస్ఎల్బీసీ లాంటి ప్రమాదమే కాళేశ్వరంలో కూడా జరిగింది కానీ.. మేము ఎంతో జాగ్రత్తగా దానిని రెక్టీఫై చేశాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం అనుమానమే. కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని అయినా ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలి. 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాం’ అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!