Bolero Collided: చెట్టును ఢీకొట్టిన బొలేరో.. ఒకే కుటుంబానికి చెందిన 5గురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bolero Collided: మధ్య ప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. సమీప బంధువు ఆత్మహత్య చేసుకుంటే చూసొద్దామని బయలుదేరింది. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బొలేరో చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు. ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. జాతర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హిమాన్షు భిండియా వివరాలు.. మంగళవారం రాత్రి మావాయి గ్రామ ప్రజలు బొలేరో నుంచి రాజ్నగర్ వైపు వెళ్తున్నారు. తికమ్గఢ్లో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వారు ప్రయాణిస్తున్న బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బొలెరోలో దాదాపు 13 మంది ఉన్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
Read Also: Umesh Yadav: రెండోసారి తండ్రయిన టీం ఇండియా ఫాస్ట్ బౌలర్
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మోతీలాల్ అన్నయ్య నందలాల్ కుమారుడు రాము (28) మంగళవారం రాత్రి రాజ్నగర్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులంతా గామిని చేరేందుకు రాజ్నగర్కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వినోద్ తండ్రి లక్ష్మీ లోధి, మోతీలాల్, రాజేష్ తండ్రి బాబులాల్ లోధీ, ప్రేమ్ బాయి భార్య బాబులాల్ లోధి, గుడ్డిబాయి మరణించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొంతమంది జిల్లా ఆసుపత్రిలో చేరగా, నలుగురిని ఝాన్సీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు.
Read Also: Minister KTR: మహిళా పారిశ్రామికవేత్తల ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు
తక్షణ సాయం
ప్రమాద ఘటనపై స్థానిక ఎమ్మెల్యే రాకేష్ గిరి గోస్వామి స్పందించారు. మృతుల బంధువులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని చెప్పారు. మృతుల్లో నలుగురు వ్యక్తులు సంబల్ యోజనకు అర్హులని, ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.4 లక్షలు అందజేస్తుందని ఎస్డిఎం సీపీ పటేల్ తెలిపారు. అదే సమయంలో మరణించిన 5వ వ్యక్తికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే తికమ్గఢ్ ఎమ్మెల్యే రాకేష్ గిరి గోస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమిత్ నునా జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!