Minister KTR: మహిళా పారిశ్రామికవేత్తల ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజం అయిన ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు విహబ్ పారిశ్రామిక వేత్తలను అభినందించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణలో లక్షలాది మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుందని తెలిపారు. మహిళలకు ఉపయోగ పడే విధంగా స్త్రీ నిధి ఏర్పాటు చేసామని గుర్తు చేశారు. విదేశీ కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు విహబ్ పారిశ్రామికవేత్తలు అన్నారు. 27వేల మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. విహబ్ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన చీరలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో ఎంతో మంది యువతులు ఉన్నారు. వారంతా ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరుకుంటారని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలు ఎందుకు కాకూడదని, రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీ పార్కుల్లో మహిళలకు ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు.
Read also: Minister Jagadish Reddy: మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్.. కుట్రలో భాగంగానే కవితకు నోటీసులు
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఆడపిల్ల అయిన, మగ పిల్లలు అయినా సమానమే అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన రెండు కరోనా వ్యాక్సిన్లు మహిళల సారధ్యంలో ఉన్న కంపెనీలవే అని గుర్తు చేశారు. మండల స్థాయి నుంచి మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయాలని కోరారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సింగిల్ విండో సిస్టమ్ ను త్వరలో తీసుకు వస్తామన్నారు. ఐదేళ్లలో ఐదు వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలు విహబ్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారం అన్నప్పుడు అది చిన్నదా, పెద్దదా అని కాదన్నారు. సంపద సృష్టించామా.. ఉద్యోగాలు సృష్టించామా అనేది చూడాలని తెలిపారు. ప్రపంచం గర్వించేలా తెలంగాణ నుంచి ఉత్పత్తులు సృష్టిస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం చాలా మంది అనాగరికంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పాలి. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ప్రభావం చూపుతుంది. పిల్లలను ఎలా పెంచుతాం అన్నదే ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రులు ఆడపిల్లలు, అబ్బాయిల మధ్య తారతమ్యం చూపకూడదు. మన ఇంటి నుంచే సమానత్వం ప్రారంభమైతే మిగతా అమ్మాయిలు, అబ్బాయిలను కూడా సమానంగా, గౌరవంగా చూస్తారని కేటీఆర్ అన్నారు.
Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!