ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొంటారని వెల్లడించారు. ఈ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Karnataka Election: కర్నాటకలో ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్లు..!
కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అథో:గతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.
Also Read : RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం
తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానకే పనిచేస్తోంది తప్ప నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు అని అన్నారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.
Also Read : Aravind Swami: మణిరత్నం హీరో ప్రమోషన్స్ లో కనిపించడేం..?
తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా అని నిరూపించాలన్నారు. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలి.. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వందమందిని తీసుకురావాలి. మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం నిర్వహించాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.