RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Need 200 Runs To Win Match Against RCB: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండిన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (68), డు ప్లెసిస్ (65) అర్థశతకాలతో ఊచకోత కోయడం.. దినేశ్ కార్తిక్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. చూడ్డానికి లక్ష్యం పెద్దగానే ఉన్నా.. వాంఖడే లాంటి స్టేడియంలో దీన్ని ఛేధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అందునా.. ముంబైకి ఇది హోమ్గ్రౌండ్ కాబట్టి, కచ్ఛితంగా ఛేధించడానికి ప్రయత్నిస్తుంది.
Naveen Wul Haq : విరాట్ కోహ్లీని రెచ్చగొడుతున్న నవీన్ ఉల్ హాక్..
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీకి మొదట్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ (1) ఔట్ అయ్యాడు. అనంతరం కాసేపటికే అనుజ్ (6) పెవిలియన్ బాట పట్టాడు. ఇలా ఆదిలోనే రెండు వికెట్లు పోవడంతో.. ఆర్సీబీ బ్యాటర్లు ఒత్తిడికి గురవుతారని, తద్వారా స్కోరు నత్తనడకన సాగొచ్చని అందరూ అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ పరుగుల సునామీ సృష్టించారు. ఎడాపెడా షాట్లతో వీళ్లిద్దరు ఊచకోత కోశారు. ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఎలాంటి బంతులు వేసినా.. తమ 360 డిగ్రీ ఆటతో వీళ్లు ‘లెఫ్ట్ & రైట్’ వాయించేశారు. ముఖ్యంగా.. మ్యాక్స్వెల్ అయితే ఊరమాస్ ఇన్నింగ్స్తో మైదానాన్ని హోరెత్తించేశాడు. వీళ్లిద్దరు క్రీజులో ఉన్నంతసేపు మైదానంలో బౌండరీల మోత మోగింది. వీళ్లు మూడో వికెట్కి ఏకంగా 120 పరుగులు జోడించారు.
Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలికను సేవ్ చేసిన ర్యాపిడో డ్రైవర్
అయితే.. డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ ఔట్ అయ్యాక ఆర్సీబీ దూకుడు తగ్గుముఖం పట్టింది. వాళ్ల తర్వాత విధ్వంసకర బ్యాటర్లు లేకపోవడంతో.. స్కోరు నిదానంగా సాగింది. దినేశ్ కార్తిక్ మాత్రం కాస్త మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 30 పరుగులు చేశాడు. అతడు ఆడిన ఆటతీరు చూసి.. ఈరోజు అతడు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని భావించారు కానీ, ఇంతలోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. గత మ్యాచ్లో అర్థశతకంతో చెలరేగిన లామ్రోర్ (1) ఈసారి డిజప్పాయింట్ చేశాడు. చివర్లో హసరంగ (12), కేదార్ జాధవ్ (12) ఏదో అలా లాక్కొచ్చారు. దీంతో.. ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మరి.. ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేధిస్తుందా?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!