Tamil Sai-Annamalai: తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు..
- తమిళి సై.. అన్నామలై గొడవకు శుభం కార్డు
- తమిళిసై ఇంటికి వెళ్లిన అన్నామలై
- ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన తమిళనాడు బీజేపీ చీఫ్
- తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్
- ఇరువురూ కలిసిన ఫొటోను షేర్ చేసిన అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు.
Also Read
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
అయితే.. జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారత్సోవానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసై పై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె అన్న మాటలకు షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు.. సీన్ మొత్తం మారిపోయింది. తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లి మాట్లాడారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్వయంగా తెలిపారు. ఇకపై నుంచి.. తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఇరువురూ కలిసిన ఫొటోను అన్నామలై షేర్ చేశారు.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 స్థానాలను డీఎంకే గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్, అటు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!