Tamil Sai-Annamalai: తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు..
- తమిళి సై.. అన్నామలై గొడవకు శుభం కార్డు
- తమిళిసై ఇంటికి వెళ్లిన అన్నామలై
- ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన తమిళనాడు బీజేపీ చీఫ్
- తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్
- ఇరువురూ కలిసిన ఫొటోను షేర్ చేసిన అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
అయితే.. జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారత్సోవానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసై పై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె అన్న మాటలకు షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు.. సీన్ మొత్తం మారిపోయింది. తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లి మాట్లాడారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్వయంగా తెలిపారు. ఇకపై నుంచి.. తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఇరువురూ కలిసిన ఫొటోను అన్నామలై షేర్ చేశారు.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 స్థానాలను డీఎంకే గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్, అటు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?