Tamil Sai-Annamalai: తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు..
- తమిళి సై.. అన్నామలై గొడవకు శుభం కార్డు
- తమిళిసై ఇంటికి వెళ్లిన అన్నామలై
- ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన తమిళనాడు బీజేపీ చీఫ్
- తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్
- ఇరువురూ కలిసిన ఫొటోను షేర్ చేసిన అన్నామలై
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
అయితే.. జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారత్సోవానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసై పై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె అన్న మాటలకు షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు.. సీన్ మొత్తం మారిపోయింది. తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లి మాట్లాడారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్వయంగా తెలిపారు. ఇకపై నుంచి.. తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఇరువురూ కలిసిన ఫొటోను అన్నామలై షేర్ చేశారు.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 స్థానాలను డీఎంకే గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్, అటు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!