BJP MP Laxman: రాహుల్, రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు!
- సీఎం రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు
- రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు
- నరేంద్ర మోడీ భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన చేర్చారు
- నాంపల్లి బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియా సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, రేవంత్ రెడ్డి 18 నెలల పాలన బేరీజు వేస్తే.. తెలంగాణ సీఎం పాలన ఏందో తెలుస్తుందన్నారు. రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి పదవిని రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ భరోసా కార్యక్రమంకి వందల మంది సమస్యలు పట్టుకొని వస్తున్నారని, లంచం ఇస్తే కానీ పనులు జరుగుతలేవని చెబుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. నేడు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Also Read: Kaleshwaram Commission: విచారణ అనంతరం ఫామ్హౌస్కు హరీష్ రావు.. కేసీఆర్తో భేటీ!
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
‘ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన చేర్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానానికి తెచ్చారు. రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు. 11 ఏళ్ల మోడీ పాలన, రేవంత్ 18 నెలల పాలన బేరీజు వేస్తే.. రేవంత్ పాలన ఏందో తెలుస్తుంది. రాహుల్ గాంధీని కలవడానికి 45 సార్లు ఢిల్లీకి రేవంత్ వెళ్ళారు. రేవంత్ తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని రాహుల్ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ నుండి డిల్లీకి మూటలు మోస్తున్నారు. రాహుల్ రాయబారివా లేదా తెలంగాణకు జవాబుదారివా రేవంత్. బీజేపీ భరోసా కార్యక్రమంకి వందల మంది సమస్యలు పట్టుకొని వస్తున్నారు, లంచం ఇస్తే కానీ పనులు జరుగుతలేవని చెబుతున్నారు. ఈ రోజు కలెక్టర్లు, అధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడాను. పనులు జరుగుతాయని మంత్రి హామీ ఇచ్చారు’ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!