Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
- పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు
- రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు
- ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగిందని ఎంపీ లక్ష్మణ్ ప్రశంసించారు.
‘పేద, వెనుకబడిన వర్గానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్దిక శక్తిగా భారత్ను రూపొందించే లక్ష్యంతో గత 11 ఏళ్లుగా మోడీ పాలన సాగింది. సబకా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో పాలన సాగించారు ప్రధాని మోడీ. మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్తో ప్రజలకు పాలన అందించారు. అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రభుత్వంలో అండ్ పార్టీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వావలంబన దిశగా పాలన సాగింది. కోవిడ్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు రాజీ లేకుండా ప్రజాక్షేమం, దేశ రక్షణ కోసం పరితపించారు. జపాన్ను అధిగమించి నాలుగవ ఆర్ధిక శక్తిగా ఆవిర్బావం. అతి త్వరలోనే మూడవ ఆర్ధిక శక్తిగా ఆవిర్భవించనున్నాం. శత్రువు గడ్డపై అడుగు పెట్టి, తీవ్రవాదులను తుదముట్టించి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడంలో విజయవంతం అయ్యారు’ అని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ అన్నారు.
Also Read
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
Also Read: Adluri Laxman: ఆ ఇద్దరు నాకు రెండు కళ్లు.. వారి సహకారంతోనే ఇంతటి వాడిని అయ్యా!
‘పలు దేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది భారతీయలనే గాకుండా, పలు ఇతర దేశస్థులను కూడా రక్షించి స్వదేశాలకు తరలించడం మరచిపోలేని గొప్ప చర్య. దేశంలో 136 వందే భారత్ రైళ్లను కొత్తగా ప్రారంభించడం ప్రధాని మోడీ సాధించిన ఘన విజయం. 11 కోట్ల మంది రైతులకు 3.7 కోట్ల లక్షల రూపాయల ఆర్దిక తోడ్పాటును అందించడం, దేశంలో 15 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు సదుపాయం, కరోనా సమయంలో 20 కోట్ల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్దిక సహాయం అందించారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వ హయాంలో మాత్రం 12 లక్షల కోట్ల రూపాయల మేరకు కుంభకోణాలు’ అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!