Vishnuvardhan Reddy: 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnuvardhan Reddy: 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు.. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందని జోస్యం చెప్పారు.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కూమార్ రెడ్డి రాకతో.. మాజీ ప్రజాప్రతినిధులందరూ బీజేపీకి టచ్లోకి వస్తున్నారని తెలిపారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కేంద్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కేసీఆర్ ట్రాప్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణువర్దన్రెడ్డి..
Read Also: Vandhe Bharat Train : వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని జింక.. అది మీద పడి ఓ మనిషి మృతి
Also Read
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
కాగా, 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగు అవుతుందంటూ విష్ణువర్ధన్రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి.. ఆ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ ఏది? అనే చర్చ సాగుతోంది.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.. మరోవైపు గతంలో 151 స్థానాల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ సారి ఏకంగా రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 175ని కైవసం చేసుకోవాలని టార్గెట్గా ముందుకు సాగుతోంది.. మరోవైపు.. అధికార వైసీపీ ఓటమియే టార్గెట్గా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది.. టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతుండగా.. ఈ తరుణంలో విష్ణువర్ధన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కనుమరుగు అయ్యే ఆ ప్రాంతీయ పార్టీ ఏంటి? అనేది చర్చగా మారిపోయింది.
తాజావార్తలు
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!