Gujjula Premender Reddy : అమరవీరులకు రేపు బీజేపీ ఘన నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజాం వ్యతిరేక పోరాటంలో నిజాంకు వ్యతిరేక పోరాటం చేసి అశువులు బాసిన అమరవీరుల స్మృతి కేంద్రాలను రేపు బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఘనంగా నివాళులర్పిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడింఒచారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ పరకాలలో, కరీంనగర్ హుస్నాబాద్ మండలం మమ్దాపురం, నిజామాబాద్ ఖిలా (జిల్లా జైలు), అదిలాబాద్ నిర్మల్ లో(1000 మందిని ఉరి తీసిన మర్రి చెట్టు), అదిలాబాద్ కోమరంభీమ్ జోడేఘాట్, మెదక్ బైరాన్ పల్లి (సిద్దిపేట జిల్లా), ఖమ్మం ఎరుపాలెం, నల్గొండ గుండ్రంపల్లి, మహబూబ్ నగర్ అప్పన్పల్లి, హైదరాబాద్ కాచిగూడ షోయుభుల్లాఖాన్ విగ్రహం వద్దకు బీజేపీ నేతలు చేరుకొని నివాళులు అర్పిస్తారని ఆయన వెల్లడించారు. నిజాం ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడిన వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సరైన విధంగా నివాళులర్పించడంలో, అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలో వెనుకడుగు వేస్తున్నదని ఆయన విమర్శించారు.
Also Read
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
బీజేపీ గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అనేక ఉద్యమాలను పోరాటాలను చేసిందని, తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా పోరాటాల ఫలితంగానే నేడు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరపడం తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదన్నారు.
తాజావార్తలు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..