MLC Elections: కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతోంది: ఎంపీ ఈటల రాజేందర్
- మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు.
- కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతోంది
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: వరంగల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు బిజెపి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అన్నారు.
Read Also: YS Jagan: గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్.. ర్యాలీగా మిర్చి యార్డ్ వద్దకు..!
Also Read
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు మూడింతలు అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నేషనల్ హైవే కోసం అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత వుందని కేంద్రం ఇందుకు సంబంధించిన నిధులను చెల్లిస్తుందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భూ నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.
Read Also: Bharat Jodo Vivah: భారత్ జోడో వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్స్
కేంద్రంపై తప్పుబాటు మాటలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే భూ సర్వేను మళ్లీ చేపట్టాలని, లేనిపక్షంలో రైతుల తరుపున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై వెంటనే స్పందించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..