Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka About Water Resources

Bhatti Vikramarka : సాగునీటి ప్రాజెక్టులపై పెట్టే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడాలి

Published Date :January 30, 2024 , 9:43 pm
By Gogikar Sai Krishna
Bhatti Vikramarka : సాగునీటి ప్రాజెక్టులపై పెట్టే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తక్కువ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధన్యతగా తీసుకోవాలన్నారు. మంగళవారం డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిన నేపత్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజల త్రాగు, సాగు నీరు అవసరాలను తీర్చే అవకాశం ఉన్నద‌న్నారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కరీంనగర్ జిల్లాకు సాగు నీరు ఇవ్వొచ్చన్నారు. తక్కవ బడ్జెట్తో వీటిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఎస్ఎల్ బిసి టన్నెల్, నక్కలగండి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి టాప్ ప్రియార్టీగా పెట్టుకోవాలన్నారు.

 

రీ డిజైన్ పేరిట గ‌త ప్ర‌భుత్వం చేపట్టిన సీతరామ ప్రాజెక్టు పూర్తి కావడానికి జాప్యం జరుగుతున్న క్రమంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో డిజైన్ చేసినటువంటి రాజీవ్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్ఎస్ పిఎల్ రెండవ జోన్ లోని కెనాల్ కు లింక్ చేయడం వల్ల ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగు నీటి ఎద్దడి లేకుండ ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగిన చెక్ డ్యాంల పరిస్థితి చాలా ఆద్వాన్నంగా ఉందని గత వర్షాలకు కొన్ని చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకొని పోవడం దారుణమన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండ అడ్డ‌గోలుగా నిర్మాణం చేడ‌యం వ‌ల్ల ప్ర‌జ‌ల సంప‌ద దుర్వినియోగం అయ్యింద‌న్నారు. ఇక నుంచి నిర్మాణం చేసే చెక్ డ్యాంల విష‌యంలో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించాలన్నారు. చెక్ డ్యాంల నిర్మాణానికి శాస్త్రీయంగా డిజైన్ చేసుకోవాల‌న్నారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024 జూన్ నాటికి పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధన్యతగా తీసుకొని యుద్ద ప్రాతిపదికన వాటి పనులు పూర్తి చేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఉప ముఖ్య‌మంత్రిని కోరారు. వచ్చే సంవత్సరం నాటికి 6లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే విధంగా ప్రాధన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఎస్ఎల్ బిసి, నక్కలగండి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డానికి కావాల్సిన నిధుల‌ను స‌ముచితంగా ఇవ్వాల‌ని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల‌కు వెచ్చించిన నిధులు, చేసిన ఖ‌ర్చులు, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పురోగ‌తి ప‌నులు, ఇంకా చేయాల్సిన ప‌నుల వివ‌రాల‌ను అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ద్వారా మంత్రుల‌కు వివ‌రించారు. ఈ సమావేశంలో హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • breaking news
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • CM Chandrababu: కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం.. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో పర్యాటకశాఖ ఎంఓయూ..!

  • Kailasa Temple Ellora: ప్రపంచమే ఆశ్చర్యపోయే ఏకశిలా క్షేత్రం.. ఒక్కసారైనా చూడాల్సిన కైలాస ధామం! ఎలా చేరుకోవాలో చూసేయండి..

  • TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..

  • Ragi cakes Recipe: జంక్ ఫుడ్‌కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!

  • Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్‌కు నో బ్రేక్..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions