Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజలు ఆగం కావొద్దు.. అండగా కాంగ్రెస్ ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ లో పలువురి చేరికలు జరిగాయి.. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మొదటి సారిగా జిల్లాలో ఒకే వేదిక మీద భట్టి, పొంగులేటి కలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో దొరలు కేంద్రంలో క్యాపిటలిస్టుల రాజ్యం కొనసాగుతుంది.. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మల్లుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Sree Leela: శేఖర్ మాస్టర్ కు సారీ చెబుతూ శ్రీలీలా మూడు పేజీల లేఖ.. ఏమైందో తెలుసా?
Also Read
- IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు...
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలు ఆగం ఆగం అయ్యారు.. తెలంగాణలో ప్రజలు ఆగం కావద్దని నిర్ణయం చేసుకున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. ఐదు లక్షల కోట్ల అప్పు తెలంగాణలో జరిగింది.. గోదావరి కృష్ణ నుంచి ఒక చుక్క నీళ్లు కూడా తెలంగాణలో పారటం లేదు అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు వచ్చి చేరుతున్నారు.. నిన్నటి వరకు నీ పక్కనే ఉన్న కమ్యూనిస్టులు కూడా నిన్ను వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారు.. కేసీఆర్ ని వదిలించుకోకపోతే ప్రమాదమని కమ్యూనిస్టులు గుర్తించారు.. కాంగ్రెస్ వాళ్ళని ప్రయోజనమని కమ్యూనిస్టు గుర్తించారు అని భట్టి తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్లోకి వలసలకి కారణం రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్ కారణం.. కేసీఆర్ ని నమ్మవద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.. మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేసినట్లేనని ఆయన చెప్పారు. బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి.. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సంపద పెరిగింది.. పెరిగిన సంపదతో తెలంగాణని కేసీఆర్ కుటుంబానికి ఇస్తే తెలంగాణ సంపదని కేసీఆర్ కుటుంబం మింగేస్తుంది.. రాష్ట్రంలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షలు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు.
Read Also: China: చైనా వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై కొవిడ్ టెస్టులు అక్కర్లే..
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ నేతల కను సైగల్లో బీఆర్ ఎస్ పార్టీ నడుస్తోంది.. బీజేపీతో సంబంధాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకీ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీలు ఐజీలు వచ్చి హోం మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికారు అని పొంగులేటి అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ల మిలాఖత్ ను యావత్ తెలంగాణ ప్రజల గమనిస్తున్నారు.. రాబోయే రోజులు మన రోజులు ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. నాలుగు డిక్లరేషన్లు ఇచ్చాము.. అధికార మదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!