China: చైనా వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై కొవిడ్ టెస్టులు అక్కర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాకు వెళ్లే ప్రయాణికులు ఇకపై బుధవారం నుంచి కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాలు ఒంటరిగా ఉన్న తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు తమ దేశం వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలలో ఈ చర్య ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబార కార్యాలయం వెబ్సైట్లో పేర్కొన్న ఒక నోటీసు ప్రకారం.. ప్రయాణికులు ఇకపై దేశం నుంచి వెళ్లేటప్పుడు, ప్రవేశించేటప్పుడు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
Read Also: Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
Also Read
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
జనవరిలో దేశ విదేశాల నుంచి వచ్చే చైనా పౌరులకు కొవిడ్ పరీక్షలు అవసరం లేదని చైనా తెలిపింది. చైనా పౌరులు ప్రయాణించగల దేశాల జాబితాను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, దక్షిణ కొరియా, జపాన్తో సహా విదేశీ గమ్యస్థానాలకు గ్రూప్ టూర్లపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తివేసింది. మూడు సంవత్సరాల జీరో-కొవిడ్ విధానాన్ని ముగించాలని చైనా గత డిసెంబర్లో నిర్ణయించింది. ఇందులో సామూహిక పరీక్షలు, కఠినమైన, నిరంతర నిర్బంధ లాక్డౌన్లు ఉన్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆసుపత్రిలో చేరడం, మరణాలలో భారీ పెరుగుదలకు దారితీసిందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించలేదని తెలిపారు.
2020 ప్రారంభంలో కొవిడ్ ఆవిర్భవించిన సమయంలో విమాన ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన సరిహద్దు నియంత్రణలకు దారితీసింది. చైనా జీరో-కొవిడ్ విధానాన్ని రద్దు చేసినప్పటి నుంచి కొవిడ్ వల్ల 60,000 మంది ఆసుపత్రిలో మరణించారని.. జనవరిలో అధికారిక చైనా ప్రభుత్వ అంచనాల కంటే అదనపు మరణాల సంఖ్య చాలా ఎక్కువ అని అధ్యయనం తెలిపింది.
తాజావార్తలు
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!