Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Beeda Mastan Rao On Behalf Of Tdp Mithun Reddy On Behalf Of Ycp And Balashouri On Behalf Of Janasena Attended The All Party Meeting

MP Prasada Rao: రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..

Published Date :January 30, 2025 , 3:18 pm
By Rajesh Veeramalla
  • ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
  • బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు..,
  • ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరణ
  • అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు..,
  • వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరు.
MP Prasada Rao: రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు. అటు.. కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. అనివార్య కారణాలతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.ఆర్ సురేష్ రెడ్డి గైర్హాజరయ్యారు.

Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం

సమావేశం అనంతరం టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. రాష్ట్ర విభజనలో పోలవరం నిర్మాణం, రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా ఇతర సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు లోక్ సభలో సమయం ఇవ్వాలని కోరాం.. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాష్ట్ర రావాల్సిన నిధులను సాధిస్తామని చెప్పారు. రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించాలని బీద మస్తాన్ రావు పేర్కొన్నారు.

Read Also: India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..

టీడీపీ లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.. రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యాయి.. లోక్‌సభ, రాజ్యసభలో టీడీపీకి సీటింగ్ ఒకే దగ్గరే ఇవ్వమని కోరామన్నారు. సీనియర్ ఎంపీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరాం.. పార్లమెంట్‌లో చర్చించే సమయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని చెప్పారు. రాష్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కోరాం.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామని ప్రసాదరావు తెలిపారు.

Read Also: Ola Electric: ఓలా నుంచి నెక్స్ట్‌ జనరేషన్‌ స్కూటర్‌.. రేపే విడుదల..

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో చర్చ జరగాలని.. మంత్రి సమాధానం ఇవ్వాలని కోరానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చ జరగాలని కోరానని అన్నారు. అలాగే.. పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకం వల్ల యువత నిర్వీర్యమైపోతోంది.. జరిగే అనర్థాలపై సావధాన తీర్మానం కింద చర్చ జరగాలని కోరానని పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్.. సహారా కుంభకోణం కంటే పెద్దది. సభలో సావధాన తీర్మానం కింద చర్చ జరగాలని కోరినట్లు మిధున్ రెడ్డి చెప్పారు. మార్గదర్శి డిపాజిటర్లు నష్టపోకుండా రక్షణ కల్పించాలన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంకు మార్గదర్శి అక్రమాలపై అఫిడవిట్ కూడా దాఖలు చేసింది.. మార్గదర్శి అక్రమాలపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరానని మిధున్ రెడ్డి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • All Party Meeting
  • Balashouri
  • beeda mastan rao
  • Delhi
  • janasena

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions