India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
- భారతదేశానికి సొంత ఏఐ..
- 6-8 నెలల్లో ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని అభివృద్ధి చేయబోతోంది.
Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
Also Read
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విణి వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని డెవలప్ చేయడానికి 18,693 జీపీయూ కలిగిన కంప్యూట్ ఫెసిలిటీ ఏర్పడినట్లు చెప్పారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడళ్లను డెవలప్ చేయడాని కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్లు ఉన్నారని చెప్పారు. బలమైన ఏఐ ఎకో సిస్టమ్ సృష్టించడానికి కంప్యూట్ సౌకర్యం అత్యంత ముఖ్యమైన భాగం అని వైష్ణవ్ చెప్పారు. పరిశోధకులు, స్టార్టప్స్, విద్యా సంస్థలకు ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి హైఎండ్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఇండియా AI మిషన్లో భాగంగా, ప్రభుత్వం షేర్డ్ కంప్యూటింగ్ వనరును స్థాపించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
కంప్యూటింగ్ ఫెసిలిటీ ముందు అనుకున్న దాని కన్నా అంచనాలు మించిపోయిందని, మొదట ప్రణాళిక ప్రకారం.. 10,000 GPUలకు బదులుగా దాదాపు 19,000 GPUలను పొందిందని, 1,480 ఎన్విడియా H200 GPUలు ఉన్నాయని, వీటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఏఐ చిప్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీటిలో దాదాపుగా 10,000 GPUలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో పనిచేయడం ప్రారంభమవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!