India AI: మనకు సొంత ఏఐ.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..
- భారతదేశానికి సొంత ఏఐ..
- 6-8 నెలల్లో ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇప్పటికే అమెరికా చాట్జీపీటీ, జెమిని వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసింది. అయితే, వీటికి పోటీగా వచ్చిన చైనీస్ ఏఐ మోడల్ ‘‘డీప్ సీక్’’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని అభివృద్ధి చేయబోతోంది.
Read Also: Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విణి వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని డెవలప్ చేయడానికి 18,693 జీపీయూ కలిగిన కంప్యూట్ ఫెసిలిటీ ఏర్పడినట్లు చెప్పారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడళ్లను డెవలప్ చేయడాని కనీసం ఆరుగురు ప్రధాన డెవలపర్లు ఉన్నారని చెప్పారు. బలమైన ఏఐ ఎకో సిస్టమ్ సృష్టించడానికి కంప్యూట్ సౌకర్యం అత్యంత ముఖ్యమైన భాగం అని వైష్ణవ్ చెప్పారు. పరిశోధకులు, స్టార్టప్స్, విద్యా సంస్థలకు ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి హైఎండ్ కంప్యూటేషనల్ మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. ఇండియా AI మిషన్లో భాగంగా, ప్రభుత్వం షేర్డ్ కంప్యూటింగ్ వనరును స్థాపించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
కంప్యూటింగ్ ఫెసిలిటీ ముందు అనుకున్న దాని కన్నా అంచనాలు మించిపోయిందని, మొదట ప్రణాళిక ప్రకారం.. 10,000 GPUలకు బదులుగా దాదాపు 19,000 GPUలను పొందిందని, 1,480 ఎన్విడియా H200 GPUలు ఉన్నాయని, వీటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఏఐ చిప్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీటిలో దాదాపుగా 10,000 GPUలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో పనిచేయడం ప్రారంభమవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!