Bandi Sanjay : మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని, కావాలనే గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల కోసం బీజేపీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తోందని, ఎస్ఐ, కానిస్టేబుల్ సమస్యలను పరిష్కరించాలని, డీజీపీ ఆఫీస్ కు పోతే బీజేపీ కార్యకర్తలు మీద విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారని ఆయన దుయ్యబట్టారు. బయటకు కనిపించకుండా గాయాలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ మధ్యకాలంలో పోలీసుల దాడులు చాలా ఎక్కువయ్యాయని, పోలీస్ ల దాడిలో గాయాలపాలైన భానుప్రసాద్ కు ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ట్రీట్ మెంట్ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Graham Reid: వరల్డ్కప్లో ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా
Also Read
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
దేశంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ కంటే ఎక్కువగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో కండిషన్స్ ఉన్నాయని, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారని, ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదు..ఎక్కడ ఏర్పాటు చెయ్యాలో చెప్పలేదు. కేసీఆర్కు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిలో చర్చకు రావాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. సర్పంచుల నిధులన్నీ కెసిఆర్ దోచుకున్నాడు. ఎంపీ అరవింద్ మీద కూడా లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అరవింద్ లిక్కర్ దందా చేయలేదు. అరవింద్ పత్తలాట ఆడలేదు’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read : AP Three Capitals: మూడు రాజధానులపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Double-Stack Container Train: భారతీయ రైల్వేల్లో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!