AUS vs IND: బుమ్రా, రోహిత్ నుంచి కోహ్లీకి షిఫ్ట్ అయిపోతారు.. హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- పెర్త్ వేదికగా మొదటి టెస్టు
- అభిమానులు అభిప్రాయాలను మార్చుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. వ్యక్తిగత కారణాలతో మొదటి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. దాంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో సిరీస్ మొత్తానికి బుమ్రానే కెప్టెన్గా కొనసాగించాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. సన్నీ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. భారత అభిమానులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారన్నారు.
హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ షోలో జతిన్ సప్రూతో మాట్లాడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25పై స్పందించాడు. ‘ఆస్ట్రేలియాపై తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధిస్తే.. జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్గా కొనసాగించమని అభిమానులు కోరుకుంటారు. ఒకవేళ రెండు మ్యాచుల్లో ఓడితే.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాలని అంటారు. మనం చాలా వేగంగా మారిపోతుంటాం. సునీల్ గవాస్కర్ను టార్గెట్ చేసి చెప్పడం లేదు. ఇదంతా జనరల్ పబ్లిక్ టాక్. గవాస్కర్ చెప్పినట్లుగా సిరీస్ మొత్తానికి ఒకరే కెప్టెన్గా ఉండటం మంచి విషయం. ఒకవేళ భారత్ సిరీస్ ఓడినా ఎవరూ ప్రశ్నించరు’ అని భజ్జీ అన్నారు.
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
Also Read: IPL 2025 Auction: శ్రేయస్ అయ్యర్పై ఆ రెండు టీమ్స్ కన్నేసాయి.. గవాస్కర్ బోల్డ్ ప్రిడిక్షన్!
‘రోహిత్ శర్మ తిరిగొచ్చాక జట్టు ఓడిందంటే.. మరో చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు. బుమ్రా మొదటి టెస్టుకు సారథ్యం వహించి.. రోహిత్ రెండో టెస్టుకు కెప్టెన్. రోహిత్, బుమ్రా నాయకత్వంలో చెరొక టెస్టు ఓడిన తర్వాత.. చాలామంది అభిమానులు విరాట్ కోహ్లీకి షిఫ్ట్ అయిపోతారు. కోహ్లీకి సారథ్యం అప్పగించడంటూ డిమాండ్స్ చేస్తారు. గవాస్కర్ చేసిన సూచన బాగుంది. భారత జట్టును నడిపించగల సత్తా బుమ్రాకు ఉంది. బీసీసీఐ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే నేను చెప్పగలను. అంతా బీసీసీఐ ఇష్టం’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి