Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్పై స్పందిస్తూ ‘డర్టీ పాలిటిక్స్’ అని మండిపడ్డారు. ఈ దుష్ట రాజకీయాలకు ప్రజలు సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది.
“మనీష్ నిర్దోషి. అతని అరెస్టు నీచ రాజకీయం. సిసోడియా అరెస్ట్ కారణంగా ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనికి స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ప్రతి పేద ఇంటి నుండి పిల్లలు బడికి వెళ్లేలా మనీష్ సిసోడియా చాలా కష్టపడ్డాడు. అతను నిజాయితీపరుడు, మర్యాదగల వ్యక్తి. కానీ వారు ఈ రోజు అతన్ని అరెస్టు చేశారు. మంచి వ్యక్తులను, దేశభక్తులను అరెస్టు చేశారు, వారి స్నేహితులు బ్యాంకుల నుంచి లక్షలాది దోచుకుంటున్నారు.” కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
Also Read
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
Read Also: Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
ఢిల్లీ కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానానికి తిరిగి వెళ్లిందని బీజేపీ పేర్కొంది. సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఈరోజు పేర్కొంది.
అయితే కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలకు బీజేపీ భయపడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. “ఆప్కి పెరుగుతున్న ప్రజాదరణ ఈ అరెస్టు వెనుక కారణం. బిజెపి ఆప్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కేసు తప్పుడుది” అని అతిషి ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!