Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్పై స్పందిస్తూ ‘డర్టీ పాలిటిక్స్’ అని మండిపడ్డారు. ఈ దుష్ట రాజకీయాలకు ప్రజలు సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది.
“మనీష్ నిర్దోషి. అతని అరెస్టు నీచ రాజకీయం. సిసోడియా అరెస్ట్ కారణంగా ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనికి స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ప్రతి పేద ఇంటి నుండి పిల్లలు బడికి వెళ్లేలా మనీష్ సిసోడియా చాలా కష్టపడ్డాడు. అతను నిజాయితీపరుడు, మర్యాదగల వ్యక్తి. కానీ వారు ఈ రోజు అతన్ని అరెస్టు చేశారు. మంచి వ్యక్తులను, దేశభక్తులను అరెస్టు చేశారు, వారి స్నేహితులు బ్యాంకుల నుంచి లక్షలాది దోచుకుంటున్నారు.” కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
- KL Rahul: రాహుల్ను ల్యాబ్లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
- Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్లు!
- Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
Read Also: Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
ఢిల్లీ కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానానికి తిరిగి వెళ్లిందని బీజేపీ పేర్కొంది. సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఈరోజు పేర్కొంది.
అయితే కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలకు బీజేపీ భయపడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. “ఆప్కి పెరుగుతున్న ప్రజాదరణ ఈ అరెస్టు వెనుక కారణం. బిజెపి ఆప్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కేసు తప్పుడుది” అని అతిషి ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
-
KL Rahul: రాహుల్ను ల్యాబ్లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
-
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
-
Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్వైఫ్గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
-
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!