Arvind Kejriwal: డర్టీ పాలిటిక్స్.. మనీష్ సిసోడియా అరెస్టుపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా అరెస్ట్పై స్పందిస్తూ ‘డర్టీ పాలిటిక్స్’ అని మండిపడ్డారు. ఈ దుష్ట రాజకీయాలకు ప్రజలు సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది.
“మనీష్ నిర్దోషి. అతని అరెస్టు నీచ రాజకీయం. సిసోడియా అరెస్ట్ కారణంగా ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనికి స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత బలపడుతుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ప్రతి పేద ఇంటి నుండి పిల్లలు బడికి వెళ్లేలా మనీష్ సిసోడియా చాలా కష్టపడ్డాడు. అతను నిజాయితీపరుడు, మర్యాదగల వ్యక్తి. కానీ వారు ఈ రోజు అతన్ని అరెస్టు చేశారు. మంచి వ్యక్తులను, దేశభక్తులను అరెస్టు చేశారు, వారి స్నేహితులు బ్యాంకుల నుంచి లక్షలాది దోచుకుంటున్నారు.” కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
Read Also: Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
ఢిల్లీ కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానానికి తిరిగి వెళ్లిందని బీజేపీ పేర్కొంది. సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఈరోజు పేర్కొంది.
అయితే కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలకు బీజేపీ భయపడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. “ఆప్కి పెరుగుతున్న ప్రజాదరణ ఈ అరెస్టు వెనుక కారణం. బిజెపి ఆప్ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కేసు తప్పుడుది” అని అతిషి ఈ రోజు ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!