Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
Minister KTR Condemns Manish Sisodia Arrest: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ను తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం అని.. ప్రతిపక్షాలపై బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి, దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో.. అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే ఈ సిసోడియా అరెస్ట్ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలు.. దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్ట్ నిదర్శనమన్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకే సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని అన్నారు. బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను, నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై.. కస్తూరి ‘డర్టీ’ మీనింగ్
Also Read
బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి.. ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చేస్తోన్న నీతిలేని, దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని హెచ్చరించారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బీజేపీ భంగపడిందని వెల్లడించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారని.. బీజేపీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Facebook Love Story: ఫేస్బుక్లో ప్రేమ.. రెండేళ్ల తర్వాత పెళ్లి.. కట్ చేస్తే!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!