Suicide: పిల్లలతో కలిసి నదిలోకి దూకిన ఆర్మీ జవాన్ భార్య..
- అస్సాంలో విషాదం
- తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ భార్య
- బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ.. పిల్లల వస్తువుల గుర్తింపు
- ఆత్మహత్యేనని పోలీసుల అనుమానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్లో ‘సారీ పిల్లలు’ అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై.. దిబ్రూఘర్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిజల్ అగర్వాల్ ఈరోజు సమాచారం ఇచ్చారు. ఇది ఆత్మహత్యేనని.. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు.
Aay: ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ సాయం.. ఎంతంటే?
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
నదిలో దూకిన వారి కోసం ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్)ని రెస్క్యూ ఆపరేషన్ కోసం చేపడుతున్నాయి. అయితే 24 గంటలు గడిచినా మహిళ, పిల్లల ఆచూకీ లభించలేదు. కాగా.. మహిళ టి పాయింట్ వద్దకు వెళ్లడాన్ని తాము చూశామని స్థానికులు చెప్పారు. బ్రహ్మపుత్ర నదిలో దూకే ముందు పిల్లలను తన శరీరానికి కట్టుకుందని తెలిపారు. మృతురాలి భర్త అరుణాచల్లోని దిగువ సియాంగ్ జిల్లాలో ఉన్న భారత సైన్యం యొక్క లికాబాలి ప్రధాన కార్యాలయంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందగా.. అతను వెంటనే దిబ్రూగఢ్ చేరుకున్నాడు.
Telangana Rains: రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు
GREF అధికారి నాగనాథ్, మహారాష్ట్ర నివాసి. తన భార్య ఎందుకు ఇలాంటి చర్య తీసుకుందో తనకు తెలియదని భర్త తెలిపాడు. ఇప్పుడు తన జీవితం కూడా ముగిసినట్లే అనిపిస్తోందని చెప్పారు. నేను నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను.. తన పిల్లల్లో ఒకరికి 7 ఏళ్లు, మరొకరికి 5 ఏళ్లు అని నాగనాథ్ తెలిపారు. కాగా.. తన భార్య పిల్లల చిత్రాలను నిన్న వాట్సప్ లో పంపించిందని.. క్యాప్షన్లో రాసిన మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పాడు. తాను తన భార్యతో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ ఆమె స్పందించలేదని నాగనాథ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!