Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Govt Signs Mou With Fssai Gets Rs 88 Crores Fund

Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు

Published Date :October 8, 2024 , 7:33 pm
By Mahesh Jakki
  • ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ
  • మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ స‌మ‌క్షలో ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు
  • 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు
Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Satya Kumar Yadav:  రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా ప్రమాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగ‌ళ‌వారంనాడు ఢిల్లీలో ఒప్పందాన్ని  కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ స‌మ‌క్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (CEO) జి.క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ క‌మిష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శ‌ర్మ ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ చొర‌వ‌తో రాష్ట్రంలో ఆహార భ‌ద్రత ప్రమాణాల్ని బ‌లోపేతం చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ ముందుకొచ్చింది. ఇందుకోసం పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ జి.క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు.

ప్రధానంగా ఏపీలో ఆహార ప‌రీక్షల ప్రయోగ‌శాల‌లు  ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖ‌త వ్యక్తం చేసింది. రూ. 20 కోట్లతో తిరుమ‌ల‌లోనూ, మ‌రో రూ.20 కోట్లతో క‌ర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌ల‌ను నెల‌కొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్షల ప్రయోగ‌శాల‌ల్నిఒక్కొక్కటి రూ. 7.5 కోట్లతో మొత్తం రూ.13 కోట్లతో నెల‌కొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేక‌ర‌ణ‌, విశ్లేష‌ణ‌ కోసం రూ.12 కోట్లు, ఆహార భ‌ద్రతా ప్రమాణాల‌పై ప్రజ‌ల్లో విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేట‌రీల‌తో పాటు అద‌నంగా మ‌రో 22 ల్యాబ‌రేట‌రీల‌ను ట‌ర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.

Also Read

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే...
  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
  • Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భ‌ద్రతా ప్రమాణాల చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ను అమ‌లు చేస్తామ‌ని మంత్రి స‌త్యకుమార్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైన మాన‌వ వ‌న‌రుల్ని, మౌలిక స‌దుపాయాల్ని క‌ల్పిస్తామ‌ని, తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ స‌ముచిత స్థానం పొందేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఆహార భ‌ద్రతా అధికారుల‌తో త‌ర‌చూ స‌మీక్షలు నిర్వహించి భ‌విష్యత్తు ప్రణాళిక‌ల్ని సిద్ధం చేస్తామ‌న్నారు. ప్రతి జిల్లాకొక ఆహార ప‌రీక్ష ప్రయోగ‌శాల కావాల‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ కోర‌గా అందుకు రూ.15 కోట్లు కేటాయిస్తామ‌ని ఏఎఫ్ఎస్ఎస్‌ఏఐ సీఈవో క‌మ‌ల‌వ‌ర్ధన‌రావు అంగీక‌రించారు.

రూ.140 కోట్లతో రాష్ట్రంలో ఆహార భ‌ద్రతా ప్రమాణాల్ని మెరుగుప‌ర్చడం ద్వారా గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధిని సాధించామ‌ని ఫుడ్ సేఫ్టీ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ పేర్కొన్నారు. అతి త్వర‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్ల నియామ‌క ప్రక్రియ‌ను ప్రారంభించి పూర్తి స్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • Food Safety and Standards Authority of India
  • FSSAI
  • Minister Satya Kumar Yadav

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions