School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Bandh: తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిని కేవలం 4 వేలకు కుదించాలని ప్రభుత్వం భావిస్తోందని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు బలమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు విద్యారంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పలు కీలక సమస్యలను కూడా ఈ బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తెరపైకి తెచ్చాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాయి. అలాగే అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, ఇంటర్ కళాశాలల్లో తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ.. అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న తీరుపై మండిపడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించడాన్ని అడ్డుకోవాలని, అలాగే నూతన విద్యా విధానాన్ని (NEP) రాష్ట్రంలో అమలు చేయడం లేదని అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్లన్నింటి సాధన కోసమే శుక్రవారం విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగానే స్పందించాయి. శుక్రవారం నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు గురువారం మధ్యాహ్నం నుంచే సందేశాలు పంపాయి. శుక్రవారం బంద్, శనివారం రెండో శనివారం సెలవు, ఆపై ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసి రానున్నాయి.
Also Read
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
తాజావార్తలు
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
-
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!