CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
- సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ ఎంపీలు
- సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా- చంద్రబాబు
- మంచి నాయకుడు.. ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి- సీఎం
- నేను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరి వాచ్ చేశాను- చంద్రబాబు
- ఏచూరితో కలిసి పని చేశాను- ముఖ్యమంత్రి చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఏచూరితో కలిసి ముందుకు సాగాం.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా సీతారాం ఏచూరి తయారయ్యారని అన్నారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్యులో స్టూడెంట్ లీడర్ గా ప్రెసిడెంట్ అయ్యారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం.. అందులో చేరడం.. అంచలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: Sitaram Yechury: రేపు ఎయిమ్స్కి ఏచూరి పార్థీవ దేహం.. భౌతికకాయాన్ని ఏం చేస్తారు?.. డాక్టర్ మాటల్లో..
Also Read
- Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
- TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ఏచూరి.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరితో కలిసి ఉండేవాడు.. ఎవరు ఎప్పుడు కనబడిన నవ్వుతూ పలకరించే వారు.. అజాత శత్రువుగా ఎన్నో పోరాతాల్లో కలిసి ముందుకు సాగామని అన్నారు. తెలుగువాడిగా ప్రత్యేక ప్రసిద్ధి చెందారు.. దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయింది.. చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.. తనకున్న అనుబంధంతో ఖచ్చితంగా చూడాలని, నివాళులు అర్పించాలని వచ్చానని చంద్రబాబు చెప్పారు. మనం ఉన్నా లేకున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!