CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
- సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు.. టీడీపీ ఎంపీలు
- సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా- చంద్రబాబు
- మంచి నాయకుడు.. ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి- సీఎం
- నేను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరి వాచ్ చేశాను- చంద్రబాబు
- ఏచూరితో కలిసి పని చేశాను- ముఖ్యమంత్రి చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఏచూరితో కలిసి ముందుకు సాగాం.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా సీతారాం ఏచూరి తయారయ్యారని అన్నారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్యులో స్టూడెంట్ లీడర్ గా ప్రెసిడెంట్ అయ్యారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం.. అందులో చేరడం.. అంచలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: Sitaram Yechury: రేపు ఎయిమ్స్కి ఏచూరి పార్థీవ దేహం.. భౌతికకాయాన్ని ఏం చేస్తారు?.. డాక్టర్ మాటల్లో..
Also Read
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
- IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ఏచూరి.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరితో కలిసి ఉండేవాడు.. ఎవరు ఎప్పుడు కనబడిన నవ్వుతూ పలకరించే వారు.. అజాత శత్రువుగా ఎన్నో పోరాతాల్లో కలిసి ముందుకు సాగామని అన్నారు. తెలుగువాడిగా ప్రత్యేక ప్రసిద్ధి చెందారు.. దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయింది.. చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.. తనకున్న అనుబంధంతో ఖచ్చితంగా చూడాలని, నివాళులు అర్పించాలని వచ్చానని చంద్రబాబు చెప్పారు. మనం ఉన్నా లేకున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!