Matrimonial fraud: మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్.. ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..ఆ తర్వాత బ్లాక్మెయిల్..
- మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్..
- ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..
- ప్రైవేట్ ఫోటోలు-వీడియోలతో బ్లాక్మెయిల్..
- పలు రాష్ట్రాల్లో నిందితుడిపై కేసులు..
- ఒడిశా మహిళ ఫిర్యాదుతో పట్టుబడిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial fraud: ఇండియాలో మాట్రీమోనీ సైట్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో గొప్పింటి సంబంధాలని బొక్కబోర్లా పడుతున్నారు. చాలా కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెబుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మచ్చిక చేసుకుని వారి వద్ద నుంచి డబ్బుతో ఉడాయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శారీరక దోపిడీకి కూడా పాల్పడుతున్నారు.
తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. మహిళల్ని పెళ్లి చేసుకుని వారిని ఆర్థికంగా దోపిడికి గురిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాకకు చెందిన బిరంచి నారాయణ్ నాథ్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలు..
వేర్వేరు ప్రొఫైళ్ల ద్వారా తనను తాను రైల్వే ఉద్యోగిగా, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా, కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తునట్లు మాయ మాటలు చెప్పి మహిళల్ని మోసగిస్తున్నాడు. పెళ్లికాని, విడాకులు తీసుకున్న లేదా వితంతులైన మధ్య వయస్కులైన మహిళల్ని అతడు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వైబ్సైట్లో పరిచయం పెంచుకుని, ఫోన్లో సుదీర్ఘ సంభాషణలు చేసి, ఆపై బాధిత మహిళల ఇంటికి వెళ్లేవాడు. నిందితుడు వారి పిల్లలకు జీవితాంతం సాయపడుతానని వాగ్దానం చేసి, వారిని మానసికంగా లొంగదీసుకునే వాడు. అతను బాధిత మహిళల్లో చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి పెళ్లి తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. గుడిలో పెళ్లి చేసుకుని, వారి ఇంట్లోనే ఉండేవాడు. వారిని తన సొంత ప్రాంతానికి తీసుకెళ్లేవాడు కాదు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించే వాడు.
ఇతడిపై రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో పాటు ఒడిశాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కటక్కి చెందిన ఓ మహిళా ఒడిశా సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ యూనిట్లో కేసు నమోదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. సదరు మహిళ 2022లో రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయింది. ఇద్దరు కుమార్తెలు ఉననారు. గతేడాది అక్టోబర్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. సుమారు రూ. 5 లక్షల నగదు, 32 గ్రాముల బంగారాన్ని దోచుకున్నాడు. ఆమె చివరకు అతని ఇతర సంబంధాలను కూడా కనుగొంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!