Matrimonial fraud: మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్.. ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..ఆ తర్వాత బ్లాక్మెయిల్..
- మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్..
- ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..
- ప్రైవేట్ ఫోటోలు-వీడియోలతో బ్లాక్మెయిల్..
- పలు రాష్ట్రాల్లో నిందితుడిపై కేసులు..
- ఒడిశా మహిళ ఫిర్యాదుతో పట్టుబడిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial fraud: ఇండియాలో మాట్రీమోనీ సైట్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో గొప్పింటి సంబంధాలని బొక్కబోర్లా పడుతున్నారు. చాలా కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెబుతూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మచ్చిక చేసుకుని వారి వద్ద నుంచి డబ్బుతో ఉడాయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శారీరక దోపిడీకి కూడా పాల్పడుతున్నారు.
తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. మహిళల్ని పెళ్లి చేసుకుని వారిని ఆర్థికంగా దోపిడికి గురిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా చెండిపాకకు చెందిన బిరంచి నారాయణ్ నాథ్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలు..
వేర్వేరు ప్రొఫైళ్ల ద్వారా తనను తాను రైల్వే ఉద్యోగిగా, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా, కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తునట్లు మాయ మాటలు చెప్పి మహిళల్ని మోసగిస్తున్నాడు. పెళ్లికాని, విడాకులు తీసుకున్న లేదా వితంతులైన మధ్య వయస్కులైన మహిళల్ని అతడు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వైబ్సైట్లో పరిచయం పెంచుకుని, ఫోన్లో సుదీర్ఘ సంభాషణలు చేసి, ఆపై బాధిత మహిళల ఇంటికి వెళ్లేవాడు. నిందితుడు వారి పిల్లలకు జీవితాంతం సాయపడుతానని వాగ్దానం చేసి, వారిని మానసికంగా లొంగదీసుకునే వాడు. అతను బాధిత మహిళల్లో చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందికి పెళ్లి తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. గుడిలో పెళ్లి చేసుకుని, వారి ఇంట్లోనే ఉండేవాడు. వారిని తన సొంత ప్రాంతానికి తీసుకెళ్లేవాడు కాదు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించే వాడు.
ఇతడిపై రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో పాటు ఒడిశాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కటక్కి చెందిన ఓ మహిళా ఒడిశా సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ యూనిట్లో కేసు నమోదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. సదరు మహిళ 2022లో రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయింది. ఇద్దరు కుమార్తెలు ఉననారు. గతేడాది అక్టోబర్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. సుమారు రూ. 5 లక్షల నగదు, 32 గ్రాముల బంగారాన్ని దోచుకున్నాడు. ఆమె చివరకు అతని ఇతర సంబంధాలను కూడా కనుగొంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!