CM Chandrababu : భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు
- రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేసిన సీఎం చంద్రబాబు
- 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్
- క్యాలెండర్ ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన చంద్రబాబు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేశారు. 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన సందర్భంగా, తెలుగు ప్రముఖుల చిత్రాలతో, చరిత్రను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు.
ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకుంటున్నామని చెప్పారు. గోబ్యాక్ సైమన్ ఉద్యమంలో ధైర్యంగా ముందుకు నడిచిన టంగుటూరి ప్రకాశం పంతులు, రాజ్యాంగంలోని స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. బోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభా సంప్రదింపుల కమిటీలో సభ్యునిగా తన సేవలు అందించారని, దుర్గాభాయ్ దేశ్ముఖ్ జాతీయ భాష, న్యాయవ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించిందని అన్నారు.
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
Suresh Babu : అప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనే అసక్తే లేదు..
మోటూరి సత్యనారాయణ జాతీయ భాషపై, ఎన్జీ రంగా అధికార వికేంద్రీకరణపై, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై తమ సూచనలు అందించారని గుర్తు చేశారు. వీరితో పాటు వీసీ కేశవరావు, అల్లాడి కృష్ణస్వామి, మొసలికంటి తిరుమలరావు, కళా వెంకట్రావు వంటి ప్రముఖులు రాజ్యాంగ నిర్మాణంలో తమ వంతు సేవలు అందించారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ చిత్రాలతో అసెంబ్లీ క్యాలెండర్ రూపొందించడం గర్వకారణమని, ఇలాంటి గొప్ప వ్యక్తుల సేవలను స్మరించడం తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తదుపరి, సీఎం చంద్రబాబు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గురించి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ, విజయవాడలో ఈ మహాసభల నిర్వహణ తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. భవిష్యత్ తరాలకు మాతృభాషను పదిలంగా అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఈ మహాసభల ప్రధాన ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడాన్ని ప్రశంసించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరును ప్రధాన వేదికకు ఇవ్వడం అభినందనీయమన్నారు. మహాసభలకు విచ్చేసిన అతిథులు, తెలుగు భాషాభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిర్వాహకుల కృషిని కొనియాడుతూ, వారిని అభినందించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?