Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్
- గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపణ.
- దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడంలేదని వ్యాఖ్యలు.
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Chiru - Raviteja : చిరు - రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
- Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడంలేదని అంబటి రాంబాబు అన్నారు. దానితో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని, పార్టీలో ఇమడలేని వారు బయటకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. అంతేకానీ, లోపలుండి కుట్ర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా మార్చాలని చూస్తున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి స్థానిక సంస్థలను తమ వశం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. పార్టీ గీత దాటిన వారి పైన సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై వైసీపీ కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ఆయన చేసిన హెచ్చరిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు దొంగ మాటలు, చీటింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీ చేసిన అక్రమాలను కళ్లముందు చూస్తున్నా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో ప్రజాస్వామ్యం కోసం గళం విప్పిన పవన్ ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏంటని విమర్శలు గుప్పించారు. అలాగే బుడమేరు వరదల పేరిట 9 కోట్ల రూపాయల స్కాం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ స్కాంను బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా వైపు నిలిచిన 24 మంది కార్పొరేటర్లకు అభినందనలు. వారు మా పార్టీకి నిజమైన బలమైన కడుగు సైనికులు” అని అన్నారు. అయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కార్పొరేటర్లపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!