Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్
- గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు
- రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపణ.
- దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడంలేదని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడంలేదని అంబటి రాంబాబు అన్నారు. దానితో ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని, పార్టీలో ఇమడలేని వారు బయటకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. అంతేకానీ, లోపలుండి కుట్ర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా మార్చాలని చూస్తున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి స్థానిక సంస్థలను తమ వశం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. పార్టీ గీత దాటిన వారి పైన సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యక్తులపై వైసీపీ కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ఆయన చేసిన హెచ్చరిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు దొంగ మాటలు, చీటింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీ చేసిన అక్రమాలను కళ్లముందు చూస్తున్నా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. గతంలో ప్రజాస్వామ్యం కోసం గళం విప్పిన పవన్ ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏంటని విమర్శలు గుప్పించారు. అలాగే బుడమేరు వరదల పేరిట 9 కోట్ల రూపాయల స్కాం చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ స్కాంను బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా వైపు నిలిచిన 24 మంది కార్పొరేటర్లకు అభినందనలు. వారు మా పార్టీకి నిజమైన బలమైన కడుగు సైనికులు” అని అన్నారు. అయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కార్పొరేటర్లపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?