Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన
- పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరం
- సంయమనం పాటించాలన్న జైశంకర్
- గల్ఫ్ దేశాలతో మోడీ టచ్లో ఉన్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. సంయమనం పాటించాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్సభలో వివరణ ఇచ్చారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. అలాగే ఇరాన్లో కూడా వేలాది మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భద్రత క్షీణిస్తోందని వాపోయారు. విధ్వంసం ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు భారతీయ రాయబార కార్యాలయం పని చేస్తోందన్నారు. అర్మేనియాకు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read
‘‘చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం అని విశ్వసిస్తున్నాం. ప్రధాని మోడీ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడారు. నేను ఈ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాను. మేము మా దౌత్య మార్గాల ద్వారా కూడా సంప్రదిస్తున్నాము. నేను ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చితో కూడా మాట్లాడాను. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఇరాన్ యుద్ధనౌక కొచ్చిలో డాక్ చేయబడింది. ఇరాన్ మమ్మల్ని అభ్యర్థించింది. అయోన్ కొచ్చిలో డాక్ చేయబడింది. సిబ్బంది భారతదేశంలో ఉన్నారు.’’ అని జైశంకర్ తెలిపారు.
On the situation in West Asia, EAM Dr S Jaishankar says," This ongoing conflict is of particular concern to India. We are a neighbouring region, and have obvious stakes that West Asia remains stable. There are one crore Indians who live and work in the Gulf nations. In Iran, too,… pic.twitter.com/5H6gYIAIhk
— ANI (@ANI) March 9, 2026
On the conflict situation in West Asia, EAM Dr S Jaishankar says," The Indian Embassy has facilitated the relocation of several Indian students in Tehran to places outside. Indian nationals in Iran on business were facilitated to cross over to Armenia to return to India. Our… pic.twitter.com/zmMDEesmYn
— ANI (@ANI) March 9, 2026
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!