Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన
- పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరం
- సంయమనం పాటించాలన్న జైశంకర్
- గల్ఫ్ దేశాలతో మోడీ టచ్లో ఉన్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. సంయమనం పాటించాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య సంఘర్షణ కారణంగా తలెత్తిన సంక్షోభంపై లోక్సభలో వివరణ ఇచ్చారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారని తెలిపారు. అలాగే ఇరాన్లో కూడా వేలాది మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భద్రత క్షీణిస్తోందని వాపోయారు. విధ్వంసం ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు భారతీయ రాయబార కార్యాలయం పని చేస్తోందన్నారు. అర్మేనియాకు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read
‘‘చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం అని విశ్వసిస్తున్నాం. ప్రధాని మోడీ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, ఇజ్రాయెల్ ప్రధానులతో మాట్లాడారు. నేను ఈ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాను. మేము మా దౌత్య మార్గాల ద్వారా కూడా సంప్రదిస్తున్నాము. నేను ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చితో కూడా మాట్లాడాను. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. ఇరాన్ యుద్ధనౌక కొచ్చిలో డాక్ చేయబడింది. ఇరాన్ మమ్మల్ని అభ్యర్థించింది. అయోన్ కొచ్చిలో డాక్ చేయబడింది. సిబ్బంది భారతదేశంలో ఉన్నారు.’’ అని జైశంకర్ తెలిపారు.
On the situation in West Asia, EAM Dr S Jaishankar says," This ongoing conflict is of particular concern to India. We are a neighbouring region, and have obvious stakes that West Asia remains stable. There are one crore Indians who live and work in the Gulf nations. In Iran, too,… pic.twitter.com/5H6gYIAIhk
— ANI (@ANI) March 9, 2026
On the conflict situation in West Asia, EAM Dr S Jaishankar says," The Indian Embassy has facilitated the relocation of several Indian students in Tehran to places outside. Indian nationals in Iran on business were facilitated to cross over to Armenia to return to India. Our… pic.twitter.com/zmMDEesmYn
— ANI (@ANI) March 9, 2026
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!