Team India: టీమిండియా కోసం అడిడాస్ అదిరిపోయే జెర్సీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో వారం రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరిస్తుంది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే జెర్సీని తయారు చేయడం ఇదే తొలిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్ సంస్థ ఇవాళ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆవిష్కరించింది.
Also Read : 1st June changes: ఈరోజు నుండి దేశంలో వచ్చిన ఐదు ప్రధాన మార్పులివే
Also Read
జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్లకు టీమిండియా ఆటగాళ్లు వేసుకోనున్నారు. జూన్ 7న ఆస్ట్రేలియాతో ప్రారంభంకాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.
Also Read : California: కుక్క కోసం లగ్జరీ ఇళ్లు.. ఎంత పెట్టి నిర్మించాడో.. తెలిస్తే షాకవ్వాల్సిందే
పురుషుల క్రికెట్తో పాటు మహిళల క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్ను అర్ధంతరంగా క్యాన్సిల్ చేసుకోవడంతో అడిడాస్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ మునుపెన్నడూ లేనంతగా వినూత్న రీతిలో సాగింది. ముంబయి వాంఖెడే స్టేడియంపైన మూడు భారీ జెర్సీలు ఆకాశం నుంచి వేళ్లాడుతున్నట్టుగా ఏర్పాటు చేశారు. అందుకోసం డ్రోన్లను వినియోగించారు. దీనికి సంబంధించిన వీడియోను అడిడాస్ తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా, ప్రస్తుతం విడుదల చేసిన జెర్సీలు… టీమిండియా నూతన కిట్ కు గ్లింప్స్ మాత్రమే. త్వరలోనే పూర్తిస్థాయి కిట్ ను అడిడాస్ ఆవిష్కరించనుంది.
An iconic moment, An iconic stadium
Introducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Ashok (@Cricvizanalys) June 1, 2023
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!