BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
- ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్
- ధ్రువీకరించిన వేటుకూరి సూర్యనారాయణ రాజు
- శ్రీరామ్ పనితీరును పార్టీ గుర్తించిందన్న పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా 900 పోలింగ్ బూతులు కమిటీ వేయటం జరిగింది. జిల్లా ఎన్నికల్లో 15 మంది అధ్యక్ష పదవిని అడగటం జరిగింది. చివరకు నలుగురు పోటీ పడ్డారు. అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి అడ్డురి శ్రీరామ్ నామినేషన్ ఇచ్చారు. అందరి అభిప్రాయాల మేరకు శ్రీరామ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది’ అని వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకున్నాం. శ్రీరామ్తో పాటు 4 పేర్లు వచ్చాయి. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించింది. రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. కార్యకర్తలందరిని శ్రీరామ్ కలుపుకుంటూ వెళ్లాలి. అధ్యక్షుడుని అనే భావన లేకుండా అందరితో కలుపుకుంటూ వెళ్లాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఇదే బాధ్యతతో శ్రీరామ్ పని చేశారు’ అని అన్నారు.
‘ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరుగుతుంది. పోలవరం, విశాఖ ఉక్కు కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహాయం చేస్తుంది. పంచాయతీ రాజ్, టాక్స్ డెవల్యూషన్ ఇలా అన్ని విధాలుగా కేంద్రం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తుంది. విజయవాడ- గుంటూరు మౌలిక సదుపాయల అభివృద్ధికి కేంద్రం సహాయం అందుస్తుంది’ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ కొత్త అధ్యకుడిపై చర్చ జరిగింది. పురందేశ్వరినే కొనసాగించాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాకు రెకమండ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..