BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
- ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్
- ధ్రువీకరించిన వేటుకూరి సూర్యనారాయణ రాజు
- శ్రీరామ్ పనితీరును పార్టీ గుర్తించిందన్న పురందేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా 900 పోలింగ్ బూతులు కమిటీ వేయటం జరిగింది. జిల్లా ఎన్నికల్లో 15 మంది అధ్యక్ష పదవిని అడగటం జరిగింది. చివరకు నలుగురు పోటీ పడ్డారు. అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి అడ్డురి శ్రీరామ్ నామినేషన్ ఇచ్చారు. అందరి అభిప్రాయాల మేరకు శ్రీరామ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది’ అని వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకున్నాం. శ్రీరామ్తో పాటు 4 పేర్లు వచ్చాయి. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించింది. రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. కార్యకర్తలందరిని శ్రీరామ్ కలుపుకుంటూ వెళ్లాలి. అధ్యక్షుడుని అనే భావన లేకుండా అందరితో కలుపుకుంటూ వెళ్లాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఇదే బాధ్యతతో శ్రీరామ్ పని చేశారు’ అని అన్నారు.
‘ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరుగుతుంది. పోలవరం, విశాఖ ఉక్కు కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహాయం చేస్తుంది. పంచాయతీ రాజ్, టాక్స్ డెవల్యూషన్ ఇలా అన్ని విధాలుగా కేంద్రం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తుంది. విజయవాడ- గుంటూరు మౌలిక సదుపాయల అభివృద్ధికి కేంద్రం సహాయం అందుస్తుంది’ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ కొత్త అధ్యకుడిపై చర్చ జరిగింది. పురందేశ్వరినే కొనసాగించాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాకు రెకమండ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!