ACB Raids: తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖపై ఏసీబీ మెరుపు దాడులు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని.. సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన చేశారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారుల బదిలీలు అయ్యాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది. రంగారెడ్డి, మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పలు పత్రాలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్తో పాటు డబ్బులు గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు
మరోవైపు.. హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో రవాణా శాఖ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. అటు.. టోలిచౌకీ ఆర్టీవో ఆఫీస్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేసింది. ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు.
ఆర్టీఏ ఆఫీసులలో, చెక్ పోస్టులలో ఏసీబీ డీకోయ్ (decoy) ఆపరేషన్ చేపట్టింది. నటులుగా మారిపోయి డ్రైవర్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏసీబీ అధికారులు క్యూ కట్టారు. లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకుని చెక్ పోస్టుల వద్ద తనిఖీలకు వెళ్లారు తెలంగాణ ఏసీబీ అధికారులు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!