ACB Raids: తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖపై ఏసీబీ మెరుపు దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఏసీబీ రైడ్స్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని.. సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన చేశారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారుల బదిలీలు అయ్యాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది. రంగారెడ్డి, మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పలు పత్రాలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్తో పాటు డబ్బులు గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు
మరోవైపు.. హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో రవాణా శాఖ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. అటు.. టోలిచౌకీ ఆర్టీవో ఆఫీస్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేసింది. ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు.
ఆర్టీఏ ఆఫీసులలో, చెక్ పోస్టులలో ఏసీబీ డీకోయ్ (decoy) ఆపరేషన్ చేపట్టింది. నటులుగా మారిపోయి డ్రైవర్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏసీబీ అధికారులు క్యూ కట్టారు. లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకుని చెక్ పోస్టుల వద్ద తనిఖీలకు వెళ్లారు తెలంగాణ ఏసీబీ అధికారులు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!