Triangle Love : ఒకే అమ్మాయిని ఇద్దరూ లవ్ చేశారు.. లాస్ట్లో ట్విస్ట్ మామూలుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triangle Love : వారిద్దరు ప్రాణ స్నేహితులు. వీరు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిపై మోజు పెంచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఒకడు ఎలాగైనా ఇంకొకడిని మట్టుబెట్టాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లే ఇంకొకరిని పార్టీ పేరుతో పిలిచి కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. పూర్నియాలో చర్చనీయాంశమైన మోహిత్ రంజన్ హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. మోహిత్ రంజన్ను అతని ఇతర సహచరుల సహాయంతో అతని ప్రాణ స్నేహితుడే చంపాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కర్రలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రయాంగిల్ లవ్ కారణంగానే మోహిత్ హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. మోహిత్ స్నేహితుడు పీయూష్ అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Sri Datta Stotram: మనోభీష్టాలు నెరవేరాలంటే శ్రీ దత్తాత్రేయ స్తోత్రం వినండి
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
మోహిత్ మెడికల్ స్టోర్స్ నడుపుతున్నాడు. మోహిత్, పీయూష్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. దీంతో మోహిత్ పై పీయూష్ కోపం పెంచుకుంటాడు. దీని కారణంగా పియూష్ మోహిత్ను ఎలాగైన తన ప్రేమను అడ్డుతొలగించుకోవాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే మోహిత్ ను చంపడానికి కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి పార్టీ సాకుతో మోహిత్కు పియూష్ ఫోన్ చేశాడు. మోహిత్, పీయూష్ మధ్య వాగ్వాదం జరిగింది. దీని తర్వాత, పీయూష్ అతని సహచరులు మోహిత్ను కొట్టి చంపారు.
Read Also: Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
మోహిత్ ను హత్య చేసిన తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మోహిత్ మృతదేహాన్ని పీయూష్ సౌరా నదిలో విసిరాడు. అలాగే మోహిత్ బైక్ను, బ్యాగును కూడా నది ఒడ్డున వదిలేశాడు. పోలీసుల గాలింపులో ఏప్రిల్ 16 న మోహిత్ మృతదేహం బెలోరి సమీపంలోని సౌరా నదిలో కనుగొన్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పీయూష్, అలోక్, కౌశల్, అమర్ కుమార్ సింగ్లను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..