Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede in Yemen: బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. సనాలో జరిగిన తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సహాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దుల్-ఖాలిక్ అల్-అఘరీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో సహాయ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలను సీలు చేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఇక్కడికి రాకుండా నిషేధం విధించారు. సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు జనాన్ని నియంత్రించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్ లైన్కు తగిలి అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారిలో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విషయం విచారణలో ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
Read Also: Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
2014లో తమ ఉత్తర బలమైన కోటను ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది. ఇది ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి 2015లో జోక్యం చేసుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ప్రేరేపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. యోధులు, పౌరులతో సహా 150,000 మందికి పైగా మరణించారు. ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!