Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
Stampede in Yemen: బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. సనాలో జరిగిన తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సహాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దుల్-ఖాలిక్ అల్-అఘరీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో సహాయ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలను సీలు చేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఇక్కడికి రాకుండా నిషేధం విధించారు. సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు జనాన్ని నియంత్రించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్ లైన్కు తగిలి అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారిలో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విషయం విచారణలో ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
Read Also: Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
2014లో తమ ఉత్తర బలమైన కోటను ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది. ఇది ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి 2015లో జోక్యం చేసుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ప్రేరేపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. యోధులు, పౌరులతో సహా 150,000 మందికి పైగా మరణించారు. ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!