Stampede in Yemen: ఘోర విషాదం.. ఆర్థిక సహాయ పంపిణీలో తొక్కిసలాట, 85 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede in Yemen: బుధవారం అర్థరాత్రి యెమెన్ రాజధాని సనాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన యెమెన్లో ఆర్థిక సహాయం పంపణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. సనాలో జరిగిన తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హౌతీ భద్రతా అధికారి తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హౌతీ నియంత్రణలో ఉన్న రాజధానిలోని సహాయం పంపిణీ చేస్తున్న పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. బంధువుల ఆచూకీ కోసం ప్రజలు సంఘటనా స్థలానికి తరలి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతం చుట్టూ భారీగా మోహరించారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సహాయాన్ని సరిగ్గా పంపిణీ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దుల్-ఖాలిక్ అల్-అఘరీ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒక పాఠశాలలో సహాయ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలను సీలు చేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఇక్కడికి రాకుండా నిషేధం విధించారు. సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు జనాన్ని నియంత్రించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్ లైన్కు తగిలి అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారిలో భయాందోళనలు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విషయం విచారణలో ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
Read Also: Oxfam India: విదేశీ నిధుల ఉల్లంఘనలపై ఆక్స్ఫామ్ ఇండియాలో సీబీఐ సోదాలు
2014లో తమ ఉత్తర బలమైన కోటను ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది. ఇది ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి 2015లో జోక్యం చేసుకోవడానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ప్రేరేపించింది. ఈ వివాదం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ప్రాక్సీ వార్గా మారింది. యోధులు, పౌరులతో సహా 150,000 మందికి పైగా మరణించారు. ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.
తాజావార్తలు
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!