Chattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పోలీసులు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మొదటి సంఘటన సుక్మా జిల్లాలోని బెల్పోచ్చా గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగింది. బెల్పోచ్చా గ్రామ సమీపంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Guinness World Record: ఎత్తు, వెడల్పులతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. వివరాలు ఇలా..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మే 26న బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెల్పోచ్చా, జినెటాంగ్ మరియు ఉస్కవాయా గ్రామాల అడవుల్లో మావోయిస్టులు గుమిగూడారనే సమాచారం ఆధారంగా జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ మరియు డిస్ట్రిక్ట్ ఫోర్స్కు చెందిన సిబ్బందితో కూడిన ఈ ఆపరేషన్ శుక్రవారం రాత్రి ప్రారంభమైంది.
బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు మే 26న బంద్కు పిలుపునిచ్చారు. పెట్రోలింగ్ బృందం బెల్పొచ్చ సమీపంలో ఉన్నప్పుడు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తుపాకులు నిశ్శబ్దంగా తర్వాత సంఘటన స్థలం నుంచి ఒక మావోయిస్టు మృతదేహం, ఒక ఆయుధం, పేలుడు పదార్ధాలు.. మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Palnadu SP: పల్నాడులో 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు
రెండో ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లా మిర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగింది. బీజాపూర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం… జమ్మేమార్క మరియు కమ్కనార్ గ్రామంలోని అడవిలో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. సోదాలు కొనసాగుతున్నాయని బీజాపూర్ పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మరణించారు. గురువారం నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!