Chattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పోలీసులు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మొదటి సంఘటన సుక్మా జిల్లాలోని బెల్పోచ్చా గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగింది. బెల్పోచ్చా గ్రామ సమీపంలో భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం యాంటీ నక్సల్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Guinness World Record: ఎత్తు, వెడల్పులతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. వివరాలు ఇలా..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
మే 26న బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెల్పోచ్చా, జినెటాంగ్ మరియు ఉస్కవాయా గ్రామాల అడవుల్లో మావోయిస్టులు గుమిగూడారనే సమాచారం ఆధారంగా జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ మరియు డిస్ట్రిక్ట్ ఫోర్స్కు చెందిన సిబ్బందితో కూడిన ఈ ఆపరేషన్ శుక్రవారం రాత్రి ప్రారంభమైంది.
బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు మే 26న బంద్కు పిలుపునిచ్చారు. పెట్రోలింగ్ బృందం బెల్పొచ్చ సమీపంలో ఉన్నప్పుడు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తుపాకులు నిశ్శబ్దంగా తర్వాత సంఘటన స్థలం నుంచి ఒక మావోయిస్టు మృతదేహం, ఒక ఆయుధం, పేలుడు పదార్ధాలు.. మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Palnadu SP: పల్నాడులో 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు
రెండో ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లా మిర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగింది. బీజాపూర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం… జమ్మేమార్క మరియు కమ్కనార్ గ్రామంలోని అడవిలో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. సోదాలు కొనసాగుతున్నాయని బీజాపూర్ పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మరణించారు. గురువారం నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!