Palnadu SP: పల్నాడులో 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికలల్లో ఘర్షణలు జరిగిన 15సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వివిధ కేసుల్లో 666మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించామని పేర్కొన్నారు. రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా పెట్టామని..చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని చెప్పారు. బైండొవర్ కేసుల్లో ముద్దాయిలను జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. భారీ భద్రత CRPS బలగాలతో పల్నాడులో భద్రతను పెంచామని వెల్లడించారు. ఈనెల 4వ తేదీన కౌంటింగ్ సమయం కావడంతో మరింత భద్రత పెంచామని.పల్నాడు జిల్లా లో పోలీసులంతా కౌంటింగ్ సమయంలో విధుల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు నాయకులు, పల్నాడు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
READ MORE: IPL 2024 Final: ట్రోఫీతో కమిన్స్, శ్రేయాస్ ఫొటో షూట్.. పడవ, ఆటోలో మాములుగా లేదుగా
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
కాగా.. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘర్షణలు జరిగాయి. నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇరు పక్షాలు ఘర్షణ పడుతున్నా.. తక్కువ మంది ఉన్న పోలీసులు వీరిని నియంత్రించడానికి తీవ్రంగా శ్రమించారు. పోలీసులంతా ఎన్నికల విధుల్లో ఉండగా ఈ ఘర్షణలు పట్టణంలో తీవ్ర భయాందోళనలను కలిగించింది. మాచర్ల నియోజకవర్గంలో హింసకాండ సంభవించింది. ఈ ఘర్షణలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందా ఏర్పాటు చేయగా.. మూడు రోజులు శ్రమించిన బృందం నివేదికను డీజీపీకి అందించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కౌంటింగ్ రోజున మళ్లీ గొడవలు మొదలయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!