Nandyala: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ.. 22 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Man dies with Heart Attack While Playing Cricket in Nandyala: దేశంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని ఓ యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన 22 ఏళ్ల మహేంద్ర ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడాడు. కాలనీ సమీపంలో తన స్నేహితులతో కలిసి ఆడుతూనే అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కంగారుపడిపోయిన స్నేహితులు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. స్థానికులు వెంటనే మహేంద్రను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేంద్ర అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
Also Read: Tirumala Cheetah: తిరుమల కాలినడక భక్తులకు ఊరట.. బోనులో చిక్కిన చిరుత!
గత ఏప్రిల్ 7వ తేదీన కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్రికెట్ టోర్నమెంట్లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో క్రికెట్ ఆడుతుండగా ఆంజనేయులు అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. క్రికెట్ అడుతున్న సమయంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. గతంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 13 ఏళ్ల బాలిక కూడా గుండెపోటుతో మరణించింది. గత కొన్నేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!