Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా… పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు. కామాంధుల చేతిలో మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారు. తాజాగా మరో అమానుష ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కోరిక తీర్చుకున్నాక బాలికను అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లా మార్గరీటా ప్రాంతంలో అనన్ భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
Read Also: Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలి.. రాజీనామా తిరస్కరణ
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
అదే ప్రాంతానికి చెందిన 12ఏళ్ల బాలిక తరచూ వీరి ఇంటివైపు వస్తుండేది. ఆ క్రమంలోనే అతడికి బాలికపై కన్ను పడింది. ఎలాగయినా ఆ చిన్నారి పై అత్యాచారం చేయాలని సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం అతడికి బాలిక ఒంటరిగా కనిపించడంతో దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన అనన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృతచేష్టలతో బాలిక భయపడిపోయింది. బాలిక ఏడవడం చూసి విషయం బయటపెడుతుందోనని అతడు మరో దారుణమైన ఆలోచన చేశాడు. బాలికను చంపి ఆ మృతదేహాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. అనంతరం అక్కడనుంచి పరారయ్యాడు.
Read Also:YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
ఇలోగా తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అనన్ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభించింది. అప్పటికే అనన్ పరారీలో వుండటంతో అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో నిందితుడు అనన్ పట్టుబడ్డాడు. అయితే స్వరాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల నుండి అనన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అనన్ ను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలన్న స్థానికులు డిమాండ్ చేయడంవల్లే పోలీసులు కాల్పులు జరిపి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?