Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Jagan Released Ysr Kalyanamastu And Shaadi Tofa Funds

YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

Published Date :May 5, 2023 , 12:25 pm
By Mahesh Jakki
YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP CM Jagan Released YSR Kalyanamastu and Shaadi tofa Funds: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి- మార్చి త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు తమ ఖాతాలో జమ కానున్నాయి. రూ. 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివాహాలు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, ఇలా చేయడంలో పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చామన్నారు.

అప్పుడే కళ్యాణమస్తు, షాదీ తోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామన్నారు. దీని వల్ల పదో తరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో మొదలవుతుందన్నారు. ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని.. ఆ తర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీడియట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నామని.. ఇంటర్మీడియట్‌ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తింపచేస్తున్నామన్నారు. జగనన్న వసతి దీవెన కూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నామని.. ఏడాదికి రూ.90వేల వరకూ ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయన్నారు. జగనన్న అమ్మ ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుందన్నారు. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం తెలిపారు. పేదరికం పోవాలంటే ఒకే ఒక్క మార్గం చదువులు మాత్రమేనని.. చదువులు ఉంటేనే.. మెరుగైన ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయన్నారు.

Read Also: Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్!

ఇంతకు ముందు ప్రభుత్వం ఎన్నికల కోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసిందని ఆయన విమర్శించారు. 17,709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టిందని ఆరోపించారు. దాదాపు రూ.70 కోట్లు ఎగర గొట్టిందన్నారు. ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారని విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారని, కానీ డబ్బు కూడా ఇవ్వలేదన్నారు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచామన్నారు. “బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50వేలకు పెంచాం. అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచాం. ” అని సీఎం పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP CM Jagan
  • AP CM Jaganmohan Reddy
  • ap news
  • telugu news

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions