Yogi Adityanath: సీఎం యోగి కీలక నిర్ణయం.. ముస్తఫాబాద్ పేరు ఇక..
- కీలక నిర్ణయం తీసుకున్న సీఎం యోగి..
- ముస్తఫాబాద్ పేరు కబీర్ధామ్గా మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు. కొత్త పేరు సంత్ కబీర్తో ఈ ప్రాంతం చారిత్రక-సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “స్మృతి మహోత్సవ్ మేళా 2025”లో సీఎం దీనిని ప్రకటించారు. ముస్తఫాబాద్ అనే పేరు ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఒక్క ముస్లిం నివాసితుడు లేకపోవడంపై యోగి ఆశ్చర్యాన్ని వ్యక్తి చేశారు.
Read Also: Montha Cyclone Effect: తీరాన్ని తాకిన ‘మొంథా’ తుఫాన్.. అక్కడ 8:30 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేత..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
సభలో యోగి మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రామం గురించి నేను అడిగినప్పుడు, దాని పేరు ముస్తఫాబాద్ అని నాకు చెప్పారు. ఇక్కడ ఎంత మంది ముస్లింలు నివసిస్తున్నారని నేను అడిగాను మరియు ఎవరూ లేరని నాకు చెప్పారు. అప్పుడు పేరు మార్చాలని చెప్పాను. దీనిని కబీర్ధామ్ అని పిలవాలి’’ అని చెప్పారు. ‘‘గతంలో పాలించిన వారు అయోధ్యను ఫైజాబాద్గా, ప్రయాగ్రాజ్ను అలహాబాద్గా, కబీర్ ధామ్ను ముస్తఫాబాద్గా మార్చారు. మా ప్రభుత్వం దానిని తిప్పికొడుతోంది.’’ అని అన్నారు. ప్రతీ తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతామని యోగి హామీ ఇచ్చారు. కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిషారణ్య, మధుర-బృందావన్, బర్సానా, గోకుల్ ఇలా ప్రతీ ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం బీజేపీ పరిపాలనలో ప్రజా నిధులు వినియోగం మారిందని చెప్పారు. గతంలో ప్రజల డబ్బుతో కబ్రస్థాన్(స్మశాన వాటికలు) సరిహద్దు గోడలు నిర్మించేందుకు ఉపయోగించేవారని, ఇప్పుడు మన విశ్వాస కేంద్రాలు, వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నామని అన్నారు. మన నాగరికత గుర్తింపు, పునరుజ్జీవనం, భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే ప్రదేశాల వైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!